డివీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ డివీవీ దానయ్య నిర్మిస్తున్న భారీ బడ్జెట్ సినిమా ఆర్ ఆర్ ఆర్. దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాని రూపొందిస్తున్నారు. మెగా పవర్ స్టార్ రాం చరణ్, యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ పోరాట యోధులుగా నటిస్తున్నారు. ఎం ఎం కీరవాణి సంగీతమందిస్తున్నారు. అయితే ఈ సినిమా భారీ కాన్వాయిస్ తో రూపొందిస్తుండటంతో చిత్రీకరణ కి ప్లాన్ చేసినప్పటికి కరోనా తో ప్రాణ ముప్పు వాటిల్లుతుందన్న ఆలోచనతో రాజమౌళి వెనక్కి తగ్గారు.
అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాని వీలైంత తక్కువ యూనిట్ సభ్యులతో చిత్రీకరణ జరిపేందుకు రాజమౌళి సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే ప్రముఖ స్టూడియోలో సెట్ ని నిర్మించే పనిలో ఉన్నారు. అంతేకాదు సినిమాలో లాగ్ అనిపిస్తున్న సీన్స్ ని స్క్రిప్ట్ లోనే తీసేయనున్నట్టు తెలుస్తుంది. రన్ టైం తగ్గినా పరవాలేదని ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంతకంటే వేరే దారి లేదని రాజమౌళి భావించారట.
ఇక మరీ ముఖ్యంగా సాంగ్స్ ని కొన్నిటిని తొలగించినట్టు తెలుస్తుంది. ఇద్దరు స్టార్ హీరోలు కావడంతో ఆర్ ఆర్ ఆర్ లో పది పాటలు ఉండేలా ముందు స్క్రిప్ట్ సిద్దం చేశారట. అయితే మరీ అంత కీలకం కాని మూడు పాటలను తొలగించినట్టు కూడా సమాచారం. అయితే రాజమౌళి సినిమాలలో సాంగ్స్ చాలా ప్రత్యేకంగా ఉంటాయన్న విషయం అందరికీ తెలిసిందే. మరి ఇలా మూడు పాటలని తొలగిస్తే ఫ్యాన్స్ హర్ట్ అవుతారా అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇక ఇప్పటికే ఈ సినిమా కొసం మూడు పాటలను ప్రముఖ గీత రచయిత సుద్దాల అశోక్ తేజ రాసినట్టు ఇంతకముందే వెల్లడయింది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?