ఏపీలో కలకలం రేగే ఘఠన చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. మంత్రి పేర్ని నానిపై హత్యాయత్నం జరిగింది. పేర్నినానిపై తాపీతో దాడి చేశాడో దుండగుడు. వెంటనే అప్రమత్తమైన మంత్రి అనుచరులు, సెక్యూరిటీ సిబ్బంది… నిందితున్ని పట్టుకున్నారు. దీంతో మంత్రి నానికి తృటిలో ప్రమాదం తప్పింది. అయితే, తాజాగా దాడికి పాల్పడిన వ్యక్తి సోదరి ఈ ఘటనపై వివరణ ఇచ్చింది.
ఆమె సంచలన వ్యాఖ్యలు
మంత్రి పేర్ని నాని హత్యాయత్నం ఘటనపై స్పందించిన నిందితుడు బడుగు నాగేశ్వరరావు సోదరి, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షురాలు బడుగు ఉమాదేవి దాడి చేసింది తన తమ్ముడేనని ప్రకటించారు. తమ తమ్ముడు చేసిన దుశ్చర్యకు కుటుంబం అంతా షాక్ కు గుయ్యామని వెల్లడించారు. “తన తమ్ముడికి రాజకీయాలు అంటకట్టడం సరికాదు . మా కుటుంబంలో నేను మాత్రమే టీడీపీలో కొనసాగుతున్నా . నా తమ్ముడు తాపీ మేస్త్రీ.. వాడికి ఏ పార్టీతో సంబంధం లేదు. నన్ను దృష్టిలో పెట్టుకుని నా తమ్ముడిపై రాజకీయ ముద్ర వేయడం సరికాదు . వాడు చేసింది ముమ్మాటికీ తప్పే . తప్పు శిక్షపడాలని నేను కోరుకుంటున్నా. ఎవరో చెబితే దాడికి పాల్పడే వ్యక్తిత్వం కూడా నా తమ్ముడిది కాదు ఇటువంటి దుశ్చర్యకు ఎందుకు పాల్పడ్డాడో నాకు తెలియడం లేదు
తాపీ పనివారి మాటలు వాడిని ప్రభావితం చేసి ఉంటాయేమో“ అని టీడీపీ నేత వ్యాఖ్యానించారు.
సంస్కారం, సభ్యత కాదు…
తమ తమ్ముడిని అడ్డం పెట్టుకుని నన్ను రాజకీయంగా అల్లరిపాలు చేయడం ఎంతవరకు సబబు అని ఉమాదేవి ప్రశ్నించారు. “తన తమ్ముడు తెలుసని, ఎటువంటి నేర చరిత్ర లేదని మంత్రి నాని స్వయంగా చెప్పారు. భవన నిర్మాణ కార్మికుడుగా ఆ యూనియన్ నాయకులు చేసే ఆందోళనల్లో పాల్గొనే వాడు . జగన్ సీఎం అయ్యాక ఇసుక పాలసీ వల్ల ఇబ్బందులుపడ్డ కార్మికుల్లో మా తమ్ముడు కూడా ఒకడు. ఇసుక కొరత వల్ల పనులు లేకుండాపోయాయని చాలా బాధ పడేవాడు .
టీడీపీ పోలింగ్ ఏజెంట్ గా వ్యవహరించేవాడని మంత్రి పేర్ని నాని గారి వ్యాఖ్యలను ఖండిస్తున్నాను. అతను చదివింది 7వ తరగతే. పోలింగ్ బూత్ ఏజెంట్ గా ఉండాలంటే 10వ తరగతి చదివి ఉండాలి. వాడి పేరు రాసుకోవడం తప్ప వాడికింకేమీ రావు
ఎప్పుడూ కూడా పార్టీ జెండాలు పట్టుకుని ఊరేగింది లేదు.. పోలింగ్ బూతు ఏజెంట్ గా వ్యవహరించినదీ లేదు.“ అని తెలిపారు.
మంత్రిపై దాడి సమయంలో ఏం జరిగింది?
కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని మంత్రి నివాసంలోనే దాడికి యత్నం జరిగింది. మంత్రిపై దాడి ఘటన కృష్ణా జిల్లాలో ఒక్కసారిగా కలకలం రేపింది. నానిపై దాడి చేసిన వ్యక్తి చెమ్మన్నగిరికి చెందిన తాపీమేస్త్రీ బడుగు నాగేశ్వరరావుగా గుర్తించారు పోలీసులు. మద్యం మత్తులోనే ఈ దాడి చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. నిందితున్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. అతని నేర చరిత్రపై ఆరా తీస్తున్నారు. కాళ్లపై పడుతున్నట్లు వచ్చి తనపై రెండు సార్లు తాపీతో దాడి చేశారని మంత్రి నాని తెలిపారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?