అదిగో పులి అంటే ఇదిగో తోక అన్నట్లు కొన్ని ప్రచారాలు కొద్దిరోజుల క్రితం ఒక ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. ఉత్తరాంధ్ర కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ప్రభావితం చేయాలని చూస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అక్కడి నుంచే షాక్ ఇవ్వాలని
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు భావిస్తున్నారని, ఇందుకోసం తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా కింజారపు అచ్చెన్నాయుడు పేరు ఖరారు చేశారనేది సదరు వార్త సారాంశం. అయితే, ఇందులో ఇప్పుడు షాకింగ్ వార్త తెరమీదకు వచ్చింది.
అబ్బో అదిరిపోయే గేమ్
చంద్రబాబు కొత్త స్కెచ్ గురించి ఓ రేంజ్లో ప్రచారం జరిగింది. ఉత్తరాంధ్రలో బలపడాలని చూస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడే పరిపాలన రాజధాని ఏర్పాటు చేసేందుకు డిసైడ్ అయి, ఈ మేరకు బలంగా ముందుకు సాగుతున్న సంగతి తెలిసిందే. ఉత్తరాంధ్రలో టీడీపీ మూలాలను దెబ్బతీసేలా అధికార పార్టీ ప్రయత్నం చేస్తోంది కాబట్టి పార్టీని బలోపేతం చేసేందుకు అచ్చెన్నాయుడుకు అధ్యక్ష పదవి ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారని, ప్రకటించడమే తరువాయి, ఒకట్రెండు రోజులే గడువు అంటూ ప్రచారం జరిగింది. అయితే, ఇప్పటి వరకూ ఆ ప్రకటనకు అతీగతి లేదు. తాజాగా అచ్చెన్నాయుడుకు అదిరిపోయే షాకిచ్చారని అంటున్నారు.
జగన్ గురించి…
ఏపీ సీఎం వైఎస్ జగన్ ఢిల్లీ టూర్పై టీడీపీ ఎంపీ కింజరపు రామ్మోహన్ నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ ఢిల్లీ నుంచి తోక ముడుచుకొని వచ్చారు తప్ప, ఏపీకి ఏమీ ఒరగబెట్టలేదని ఆయన ఢిల్లీ పర్యటనే చెబుతోందని ఆరోపించారు. ప్రత్యేకహోదా సహా, ఇతర అంశాలపై జగన్ ఇచ్చిన హామీలను ఆయనే తుంగలో తొక్కాడని టీడీపీ ఎంపీ ఆరోపించారు. ప్రధానితో తానేం చర్చించాననే విషయాలను ముఖ్యమంత్రి బయటకు చెప్పకపోవడం చూస్తుంటే, రాష్ట్రానికి నయాపైసా ప్రయోజనం చేకూర్చే అంశాలేవీ ఆయన మోదీతో చర్చించలేదని స్పష్టమవుతోందని రామ్మోహన్ నాయుడు వ్యాఖ్యానించారు.
ఇదే కదా ఇదే కదా…
ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా ఇప్పటికే చంద్రబాబు అచ్చెన్నాయుడు పేరును ఖరారు చేసి ఉంటే… ఇప్పటివరకు అచ్చెన్నాయుడు ఎందుకు మీడియా ముందుకు రావడ లేదని, కనీసం పత్రికా ప్రకటన కూడా విడుదల చేయడం లేదని పలువురు చర్చించుకుంటున్నారు. అచ్చెన్నా పేరును మీడియాలో వైరల్ చేయించి అంతలోనే ఆయనకు చంద్రబాబు షాక్ ఇచ్చారని టాక్ వస్తోంది. అయితే, ఈ సంతృప్తి తన వైపు మళ్లకుండా ఉండేందుకు దివంగత ఎర్రన్నాయుడు కుమారుడు అయిన అచ్చెన్నాయుడును ముందుకు తెస్తున్నారని కొందరు వైసీపీ నేతలు నెట్టింట కామెంట్లు చేస్తున్నారు. చంద్రబాబు తాజా వెన్నుపోటు ఇది అని విమర్శిస్తున్నారు. ఈ ఆరోపణలపై టీడీపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి మరి.