Shocking : ఈ మధ్య వెలుగులోకి వస్తున్న ఒక్కొక్క ఘటన చూస్తుంటే మనుషులు ఇలా కూడా ఉంటారా అని అనిపిస్తుంది. తాజాగా జపాన్ లో ఒక విచిత్రమైన ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది ఒక మహిళ తన తల్లి శవంతో గత పదేళ్లుగా సహజీవనం చేస్తున్న దృశ్యం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. తల్లి చనిపోయిందని తెలిస్తే ఆమె నుండి ఎక్కడ దూరం చేస్తారో అని భయం తో ఇంట్లోనే ఫ్రీజర్లో ఆమె శవాన్ని దాచి పెట్టినట్లు ఆ మహిళ శనివారం పోలీసులకు తెలిపింది.
దాంతో చుట్టుపక్కల ఇళ్లలోని వారి ఒళ్ళు ఒక్కసారిగా గగుర్పొడిచింది. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం జపాన్ రాజధాని నగరమైన టోక్యోలోని యుమీ యోషినో అనే మహిళ తన అపార్ట్మెంట్ లో ఒక మృతదేహాన్ని దాచి ఉంచిన అనుమానంతో ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఆమె ఇంటిలో ఒక మహిళ మృతదేహాన్ని బయటకి తీశారు. ఆ మృతదేహం పదేళ్ల కింద చనిపోయిన తన తల్లిది అని అప్పటి నుండి ఇంట్లోనే ఫ్రిజ్లో భద్రపరిచి అని ఆమె చెప్పడం గమనార్హం.
Shocking కారణం
తన తల్లిని తన నుండి దూరం చేసుకోవడం తనకు ఇష్టం లేదని…. అందుకే ఆమె ఎప్పటికీ నాతోనే ఉండాలన్న భావనతో ఇలా భద్రపరిచాను అని యోషినో పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు. చనిపోయేటప్పుడు ఆమె వయసు 60 ఏళ్లు ఉండగా మున్సిపల్ హౌసింగ్ కాంప్లెక్స్ అపార్ట్మెంట్ లో కూతురు ఒక ఫ్లాట్ లీజు కి తీసుకుంది. అయితే తన తల్లి ఎలా చనిపోయిందో మాత్రం ఆ మహిళా వెల్లడించలేదు.
ఇంతకీ ఈ విషయం ఎలా బయటపడింది అంటే…. యోషినో అద్దె చెల్లించకపోవడంతో జనవరి మధ్యలో బలవంతంగా అపార్ట్మెంట్ ఖాళీ చేయించినట్లు స్థానిక మీడియా తెలిపింది. ఇదే క్రమంలో అపార్ట్ మెంట్ ను శుభ్రం చేస్తున్న వ్యక్తి ఫ్రీజర్ లో ఉన్న మృతదేహాన్ని గుర్తించి వెంటనే పోలీసు అధికారులకు విషయం తెలియజేయడంతో ఈ విషయం బయటకు వచ్చింది.