కనిపించని మహమ్మారి కరోనా దాదాపు ఏడునెలలుగా మనల్ని అతలాకుతలం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ వైరస్ కారణంగా దాదాపు ఏడు నెలలుగా లాక్ డౌన్ ఆంక్షలతో గడపవలసి వస్తోంది.
అయినప్పటికీ, ఈ మహమ్మారికి విరుగుడు లభించక, పరిస్థితులు సద్దుమణగక అనేకమంది జీవితాలు తీవ్రంగా ప్రభావితం అవుతున్న సమయంలో ఇంకో రెండు షాకింగ్ న్యూస్లు వెలుగులోకి వచ్చాయి. అందులో ఒకటి కరోనాకు సంబంధించిన నెగటివ్ వార్త అయితే మరొకటి పాజిటివ్ వార్త.
కరోనాను గుర్తించడం ఇలాగా?
కరోనా వ్యాధిని గుర్తించే క్రంలో పలు లక్షణాలను వివరించిన సంగతి తెలిసిందే. దగ్గు, జ్వరం, శ్వాస సంబంధిత సమస్యలు వంటి లక్షణాలు కనిపిస్తే కరోనా అని భావించాలన్నారు. అనంతరం రుచి, వాసన తెలియకపోవడాన్ని కూడా చేర్చారు. కళ్లు ఎర్రబడటం కూడా భాగమేనని అన్నారు. కొద్దికాలానికి ఈ లిస్ట్లో విరోచనాలు కూడా చేరిపోయాయి. ఆ తర్వాత ఎక్కిళ్లు రావడం కూడా మరో లక్షణంగా తేల్చారు. తాజాగా ఇంకో షాకింగ్ వార్త తెరమీదకు వచ్చింది. రక్తంలో ఆక్సిజన్ స్థాయిలు తగ్గితే కరోనా సోకినట్లుగా అనుమానించాలని వైద్యులు చెబుతున్నారు.
ముందే గుర్తించకపోతే….
సాధారణంగా రక్తంలోని ఆక్సిజన్ స్థాయి 75 నుంచి 100 ఎంఎం హిమోగ్లోబిన్ వరకు ఉంటుంది.. ఈ శాతం 95 కంటే ఎక్కువగా ఉంటే సాధారణంగా పరిగణించవచ్చు… అంటే 95 తక్కువగా ఉంటే అసాధారణంగా పరిగణిస్తారు. రక్తంలో ఆక్సిజన్ స్థాయి తగ్గడాన్ని వైద్యపరిభాషలో హైపోక్సియాగా వ్యవరిస్తారు. కొందరిలో కరోనా లక్షణాలు కనిపించనప్పటికీ ఆక్సిజన్ స్థాయిలు తక్కువగా ఉండటాన్ని వైద్యులు గుర్తించారు. వీరిని కూడా కరోనా సోకినట్లుగానే భావించి చికిత్స అందించాలని స్పష్టం చేశారు. కరోనా లక్షణాలు లేనప్పటికీ రక్తంలో ఆక్సిజన్ స్థాయి తగ్గిపోతోందని, ఇది ముందే గుర్తించకపోతే చాలా ప్రమాదం అని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇప్పుడు మనం ఏం చేయాలంటే…
కరోనా కొత్త లక్షణం ఆందోళనకరంగా ఉన్న నేపథ్యంలో వైద్యులు పలు జాగ్రత్తలు సూచిస్తున్నారు. పల్స్ ఆక్సిమీటర్తో రక్తంలోని ఆక్సిజన్ స్థాయిలను గుర్తించవచ్చు. అయితే, కరోనా సోకిన అందరిలో ఆక్సిజన్ స్థాయిలు తగ్గకపోవచ్చని చెబుతున్నారు వెద్యులు. ఊపిరితిత్తులు, గుండె, మధుమేహం, రక్తపోటు వంటి సమస్యలున్నవారు మాత్రం ఆక్సిజన్ స్థాయిల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో పల్స్ ఆక్సిమీటర్ సహాయంతో రక్తంలోని ఆక్సిజన్ స్థాయిలను రెగ్యులర్గా చెక్ చేసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. వైద్యుల సూచనలను ప్రమాణంగా తీసుకుని ఆ మేరకు జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు.
నెగటివ్ వార్త ఏంటంటే…
ప్రస్తుతం కరోనా పరీక్షలు చేయించుకుంటు ప్రజలు జాగ్రత్తగా ఉంటున్న పరిస్థితి కనిపిస్తోంది. పరీక్షల్లో నెగటివ్ వస్తే ఒకింత ప్రశాంతంగా ఉంటున్నారు. అయితే, పరీక్షల్లో నెగటివ్ వచ్చిందంటే కరోనా సోకలేదని కాదని అంటున్నారు. అందుకే తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు. సో…మనమంతా బీకేర్ఫుల్గా ఉండాల్సిందే. వ్యాక్సిన్ వచ్చే వరకు జాగ్రత్త తప్పదు.