పవిత్రమైన తిరుమలలో అంతకంటే పవిత్రమైన స్వామి భక్తి ఛానల్లో పని చేస్తున్న ఉద్యోగుల బూతు బాగోతం కలకలం రేపిన సంగతి తెలిసిందే. టీటీడీకి చెందిన ఎస్వీబీసీ ఛాన్లో బూతు సైట్ లింక్ కలకలం రేపిన సంగతి తెలిసిందే.
శతమానం భవతి కార్యక్రమానికి సంభిందించి ఎస్వీబిసికి ఒక భక్తుడు మెయిల్ చేశాడు. అయితే తిరిగి భక్తుడికి బూతు సైట్ వీడియోను ఓ యస్వీబిసి ఉద్యోగి పంపడం సంచలనం రేకెత్తించింది. దీంతో భక్తుడు టీటీడీ ఈవో సహా చైర్మన్ కు కూడా ఫిర్యాదు చేశాడు. అయితే, ఈ ఉద్యోగి ఒక్కడే కాదని మరింత మంది ఈ జాబితాలో ఉన్నారని తేలింది.
బూతు వీడియో తర్వాత ఏం జరిగిందంటే…
బూతు వీడియో బాగోతంపై తీవ్రంగా స్పందించిన ఈవో జవహర్ రెడ్డి టీటీడీ విజిలెన్స్ కి సమాచారం అందించారు. దీంతో ఎస్వీబీసీ కార్యాలయంలో టీటీడీ విజిలెన్స్, సైబర్ క్రైమ్ టీం, ఈడిపి అధికారులు తనిఖిలు నిర్వహించారు. పోర్న్ సైట్ వీడియో పంపిన ఉద్యోగి గురించి ఆరా తీస్తే షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. కార్యాలయంలో బూతు సైట్లు చూస్తూన్న మరో 5 గురు ఉద్యోగులను సైబర్ క్రైమ్ టీం గుర్తించింది. అంతే కాకుండా కార్యాలయంలో విధులు నిర్వహించకూండా ఇతర వీడియోలు చూస్తూన్న మరో 25 మంది సిబ్బందిని సైబర్ క్రైమ్ టీం గుర్తించింది.
ఆయన కంప్యూటర్లో ఉన్నవన్నీ అవే….
మరోవైపు ఓ ఉద్యోగి బాగోతం అంతా బూతు పురాణమే. ఎడిటింగ్ విభాగంలో పనిచేస్తున్న ఉద్యోగి హార్డ్ డిస్క్ లో సైబర్ టీం పూర్తిగా పోర్న్ వీడియోలను గుర్తించింది. ఎస్వీబిసి కార్యలయంలో ఐదు హార్డ్ డిస్క్ లతో పాటు మూడు కంప్యూటర్ లను సైబర్ టీం స్వాధీనం చేసుకున్నారు. పోర్న్ విడియో లింక్ ఘటనలో నేడో… రేపో…మరో ముగ్గురి ఉద్యోగుల పై వేటు పడే అవకాశం ఉందని అంటున్నారు. కాగా, టీటీడీ ఛానల్లో ఫోర్న్ వీడియోలు చూడటం దారుణమని పలువురు మండిపడుతున్నారు. ఎస్వీబీసీ ఉద్యోగులను తీసేయాలని డిమాండ్ చేస్తున్నారు.