Post Office : పోస్టాఫీస్లో సేవింగ్స్ అకౌంట్ ఉన్న వారికి బ్యాడ్ న్యూస్.. ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్స్ అమలులోకి రానున్నాయి. దీంతో పోస్టాఫీస్ కస్టమర్లపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడనుంది. ఇకపై అకౌంట్లో డబ్బులు వేయాలన్నా, తీయాలన్నా చార్జీలు చెల్లించుకోవాల్సి రావొచ్చు.ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ IPPB కస్టమర్లు అదనపు చార్జీలు చెల్లించుకోవాలి. ఇంకా ఆధార్ ఎనేబుల్ పేమెంట్ సిస్టమ్ ద్వారా జరిపే లావాదేవీలపై కూడా చార్జీలు ఉంటాయి. నిర్ధేశించిన ఉచిత ట్రాన్సాక్షన్ లిమిట్ దాటిన తర్వాత చార్జీల బాదుడు మొదలవుతుంది.
ఈ టైపులో బాదేస్తారు!
బేసిక్ సేవింగ్స్ అకౌంట్ కలిగిన వారు నెలకు 4 సార్లు ఉచితంగా ఎలాంటి చార్జీలు లేకుండా డబ్బులు విత్డ్రా చేసుకోవచ్చు. తర్వాత లావాదేవీ విలువలో 0.5 శాతం లేదా గరిష్టంగా రూ.25 వరకు చార్జీ పడుతుంది. క్యాష్ డిపాజిట్ చార్జీలు ఉండవు. బేసిక్ అకౌంట్ కాకుండా ఇతర అకౌంట్ ఉన్న వారిపై చార్జీలు ఉంటాయి.సేవింగ్స్ ఖాతా కలిగిన వారు వారి అకౌంట్ నుంచి నెలకు రూ.25 వేల వరకు విత్ డ్రా చేసుకోవచ్చు. తర్వాత ప్రతి లావాదేవీకి చార్జీలు పడతాయి. రూ.25 లేదా లావాదేవీ విలువలో 0.5 శాతం చార్జీ చెల్లించుకోవాలి. అలాగే నెలలో రూ.10,000 వరకు క్యాష్ డిపాజిట్పై చార్జీలు ఉండవు. ఇంకా దీనికి మించి డిపాజిట్ చేస్తే మాత్రం ప్రతి సారి 0.5 శాతం వరకు చార్జీలు చెల్లించుకోవాలి.ఏఈపీఎస్ లావాదేవీలపై కూడా చార్జీలు ఉన్నాయి. ఐపీపీబీ నెట్వర్క్లో అయితే ఎలాంటి చార్జీలు ఉండవు. ఎన్నిసార్లైనా ఏఈపీఎస్ ట్రాన్సాక్షన్లు నిర్వహించొచ్చు. అయితే నాన్ ఐపీపీబీ నెట్వర్క్లో అయితే నెలకు 3 లావాదేవీలు ఉచితం. ఈ లిమిట్ దాటితే రూ.20 చార్జీలు చెల్లించుకోవాలి.
Post Office : పోస్టాఫీసులకి ఇక గడ్డురోజులే!
ఇప్పటి వరకు బ్యాంకుల్లో ఖాతాలు అంటే భయపడిపోయి పోస్టాఫీసువైపు దారి మళ్లిన వారికి ఇకపై పగలే చుక్కలు కనిపించబోతున్నాయి.కొన్ని కొత్త రకాల సంస్కరణలు ప్రవేశ పెట్టడం వల్ల ఇటీవలి కాలంలో పోస్టాఫీసులకు ఆదరణ పెరిగింది.ఇప్పుడిప్పుడే ఖాతాదారులు పోస్టాఫీసుల్లో కూడా ఫిక్సెడ్ డిపాజిట్లు వేయటం సేవింగ్స్ బ్యాంక్ ఖాతాలు తెరవడం వంటివి చేస్తున్నారు.కానీ వచ్చే నెల ఒకటో తేదీనుండి అమల్లోకి రానున్న కొత్త నిబంధనల కారణంగా చాలామంది ఖాతాదారులు పోస్టాఫీసులకు గుడ్బై చెప్పే ప్రమాదం పొంచి ఉందని చెప్పవచ్చు.