NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

ప‌క్క రాష్ట్రం సంచ‌ల‌న నిర్ణ‌యం….దేశంలో టెన్ష‌న్‌?

corona virus increasing in india

దేశ‌వ్యాప్తంగా క‌రోనా క‌ల‌క‌లం కొన‌సాగుతోంది. కొన్ని రాష్ట్రాలు తీవ్రంగా ఈ మ‌హ‌మ్మారి బారిన ప‌డుతున్నాయి. corona virus increasing in india

ఇలాంటి స‌మయంలో పొరుగు రాష్ట్రమైన తమిళనాడు కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. లాక్‌డౌన్‌ను సెప్టెంబర్ 30 వరకు పొడిగించినట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎడప్పాడి కె పళనిస్వామి ప్ర‌క‌టించారు. అంతే కాకుండా ప‌లు కీల‌క నిర్ణ‌యాలు ఆయ‌న వెల్ల‌డించారు.

త‌మిళ‌నాడులో షాకింగ్ ఘ‌ట‌న‌లు

రోజూ వేల‌ల్లో కొత్త కేసులు న‌మోద‌వుతుండ‌టం ద్వారా త‌మిళ‌నాడులో క‌రోనా మ‌హ‌మ్మారి ఉధృతి ఏమాత్రం త‌గ్గ‌డంలేదు. చెన్నై రాష్ర్టంలో ప్రతిరోజు వేలల్లో కేసులు నమోదు అవుతుండగా.. మరణాల సంఖ్య కూడా రోజురోజుకూ రెట్టింపవుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ర్టంలో 6,495 కరోనా కేసులు నమోదు కాగా.. మొత్తం కేసుల సంఖ్య 4,22,085కు చేరింది. ఇవాళ 94 మంది వ్యాధి బారిన పడి మరణించగా.. ఇప్పటివరకు 7,231మంది మృత్యువాత పడ్డారని రాష్ర్ట వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. ఇప్పటివరకు 3,62,133 మంది వ్యాధి నుంచి పూర్తిగా కోలుకోగా.. ప్రస్తుతం 52,721 యాక్టీవ్‌ కేసులున్నాయి.

అందుకే సీఎం సంచ‌ల‌న నిర్ణ‌యం

తమిళనాడులో కరోనా విలయం కొనసాగుతుండ‌టం, రాష్ట్రంలో పెద్ద ఎత్తున పెరుగుతున్న కేసుల నేప‌థ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎడప్పాడి కె పళనిస్వామి కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అన్‌లాక్ 4 మార్గదర్శకాలు, నిబంధనలను రాష్ట్ర ప్రజలు పాటించాలని పేర్కొన్నారు. రాష్ట్రంలో లాక్ డౌన్ కొన‌సాగిస్తున్న‌ట్లు సీఎం ప‌ళ‌నిస్వామి ప్ర‌క‌టించారు. అంతర జిల్లాల ప్రయాణాలకు ప్రవేశపెట్టిన ఈ పాస్ విధానాన్ని నిలిపివేస్తున్నట్లు వెల్లడించారు. అన్ని ప్రార్థనా మందిరాలు, హోటళ్లు, రిసార్టులకు అనుమతిస్తున్నట్లు సీఎం పళనిస్వామి వివరించారు. సడలింపు నిబంధనల ప్రకారం ఆదివారాల్లో పూర్తిగా లాక్‌డౌన్ ఉండదని సీఎం ప‌ళ‌నిస్వామి చెప్పారు.

దేశంలో సంచ‌ల‌న ప‌రిణామాలు

ఇదిలాఉండ‌గా, దేశంలో కరోనావైరస్ క‌రాళ నృత్యం చేస్తోంది. లాక్‌డౌన్ నిబంధ‌న‌ల‌ను స‌డ‌లిస్తున్న కొద్దీ దేశంలో క‌రోనా కేసులు అధిక‌మ‌వుతున్నాయి. వ‌చ్చే నెల నుంచి అన్‌లాక్‌-4 అమ‌ల్లోకి రానుండ‌గా, వ‌ర‌సుగా గ‌త నాలుగు రోజులుగా 75 వేల‌కు పైగా పాజిటివ్ కేసులు న‌మోద‌వుతున్నాయి. ఈరోజు రికార్డు స్థాయిలో 79 వేల‌కు ద‌గ్గ‌ర‌గా న‌మోద‌య్యాయి. దీంతో ఒకేరోజు అత్య‌ధిక కేసులు న‌మోదైన దేశంగా భార‌త్ నిలిచింది.దేశ‌వ్యాప్తంగా గ‌డిచిన 24 గంట‌ల్లో 78,761 మంది క‌రోనా బారిన ‌ప‌డ్డారు. దీంతో దేశంలో క‌రోనా పీడితులు 35,42,734కు చేరారు. ఇందులో 7,65,302 కేసులు యాక్టివ్‌గా ఉండ‌గా, 27,13,934 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. శ‌నివారం ఉద‌యం నుంచి ఆదివారం వ‌ర‌కు క‌రోనాతో కొత్త‌గా 948 మంది మ‌ర‌ణించారు. దీంతో మ‌రోనా మృతులు 63,498ల‌కు చేరార‌ని కేంద్ర ఆరోగ్య ప్ర‌క‌టించింది.

షాక్‌కు లోన‌య్యే లెక్క‌లు

దేశంలో గ‌త‌ వారం రోజుల వ్య‌వ‌ధిలో పాజిటివ్ కేసుల సంఖ్య మ‌రింత‌గా పెరిగింది. వారం రోజులుగా ప్ర‌తిరోజుకు సగటున 70,867 కేసులు నమోదవుతున్నాయి. దీంతో ఏడు రోజుల్లోనే 4,96,070 కేసులు నమోదయ్యాయి. ఇది ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఏడు రోజుల వ్యవధిలో ఒక దేశంలో అత్యధికంగా నమోదైన పాజ‌టివ్ కేసుల సంఖ్య. దీంతో అమెరికాలో జూలై చివరివారంలో న‌మోదైన కేసుల సంఖ్య‌ను అధిగ‌మించిన‌ట్లయ్యింది.

author avatar
sridhar

Related posts

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!

ఆ వైసీపీ నాయ‌కుడికి మేం జై కొట్ట‌లేం… కూట‌మి ప్ర‌యోగం విక‌టిస్తోందా..?

వైసీపీ స‌ర్వేల్లోవైసీపీ స‌ర్వేల్లోనూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?నూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?

చంద్ర‌గిరిలో ర‌స‌వ‌త్త‌ర పోరు.. చెవిరెడ్డి వార‌సుడి స‌క్సెస్ రేటెంత‌..!

ఏపీ బీజేపీని గోదావ‌రిలో ముంచేస్తోన్న పురందేశ్వ‌రి…?

AP Elections: ఏపీలో అట్టహాసంగా నేతల నామినేషన్ లు

sharma somaraju

Pawan Kalyan: పవన్ హెలికాఫ్టర్ లో సాంకేతిక లోపం .. తాడేపల్లిగూడెం, ఉంగుటూరు సభలు రద్దు   

sharma somaraju

Lok Sabha Elections 2024: బీజేపీ జాక్ పాట్ .. ఎన్నికలకు ముందే ఆ లోక్ సభ స్థానం ఏకగ్రీవం

sharma somaraju

Teachers Recruitment Scam: బెంగాల్ హైకోర్టు సంచలన తీర్పు .. 25వేల మంది ఉపాధ్యాయులకు బిగ్ షాక్ .. సీఎం మమతా బెనర్జీ ఏమన్నారంటే ..?

sharma somaraju

MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ ముగిసిన వాదనలు .. తీర్పు ఎప్పుడంటే..?

sharma somaraju

AP Elections 2024: మరో 38 మంది అభ్యర్ధులను ప్రకటించిన కాంగ్రెస్

sharma somaraju

Rashmika Mandanna: సాయి పల్లవి దయతో స్టార్ హీరోయిన్ అయిన రష్మిక.. నేషనల్ క్రష్ కు న్యాచురల్ బ్యూటీ చేసిన సాయం ఏంటి?

kavya N

Raj Tarun: పెళ్లిపై బిగ్ బాంబ్ పేల్చిన రాజ్ త‌రుణ్‌.. జీవితాంతం ఇక అంతేనా గురూ..?

kavya N