NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

అమ‌రావ‌తి ఆందోళ‌ల‌న‌కు ఏడాది … ఇక ఆపేయ‌డ‌మే మేలు !

YS Jagan: Big Plan to Shift Capital

అమరావతినే ఏకైక రాజధానిగా ప్రకటించాలనే డిమాండ్‌తో ఒకే రాష్ట్రం-ఒకే రాజధాని అనే నినాదంతో అమరావతి ఉద్యమం జ‌రుగుతోంది. డిసెంబ‌ర్ 16 కి ఏడాది పూర్త‌యింది. ఉద్య‌మానికి ఏడాదైన సందర్భంగా రైతులు గ్రామాల్లో ఆందోళనలు ఉధృతం చేశారు. అయితే, ఈ ఆందోళ‌న‌ల‌పై సోష‌ల్ మీడియా కొత్త ప్ర‌చారం జ‌రిగింది.

అమ‌రావ‌తిలో ఆందోళ‌న‌లు…

అమ‌రావ‌తి ఆందోళ‌న‌ల‌కు ఏడాది పూర్త‌యిన సంద‌ర్భంగా రైతులు, మహిళలు వివిధ రూపాల్లో తమ నిరసన వ్యక్తం చేశారు. తుళ్లూరుతో ఇంటింటికి అమరావతి ,వెంకటపాలెంలో దళితులు బైక్ ర్యాలీ పెదపరిమిలో రైతులు పాదయాత్ర.. కార్యక్రమం నిర్వహించారు. 105 మంది రైతులు మనోవేదనతో ప్రాణాలు కోల్పోయినా ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. శాంతియుత పోరాటం చేస్తున్న రైతులపై లాఠీ చార్జీలు, అక్రమ కేసులు పెడుతున్నారని, తమను భయపెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు.

నేడు కీల‌క స‌భ

రాజధానిగా అమరావతినే కొనసాగించాలని రైతులు, మహిళల ఉద్యమం ఏడాది పూర్తయిన సందర్భంగా.. నేడు రాయపూడిలో సంఘీభావ సభ జరగనుంది. సభ ఏర్పాట్లను.. రాజధాని మహిళలు దగ్గరుండి పర్యవేక్షించారు. తమ భవిష్యత్ తో ఆడుకుంటున్న సీఎం జగన్ కు గుంటూరు మిర్చి రుచి ఏంటో చూపిస్తామని వ్యాఖ్యానించారు. అమరావతే రాజధానిగా ఉండాలని ఇప్పటి వరకు శాంతియుతంగా చెప్పామని, ఇక నుంచి అలా ఉండదని పేర్కొన్నారు. ఏపీ ప్రజలకు రాజధాని అంటూ ఒక్కటి ఉండాలనే ఉద్దేశంతోనే తాము భూములు ఇచ్చామని రాజధాని మహిళలు తెలిపారు. తమ ఉద్యమానికి అమరావతిలోని 29 గ్రామాలతో పాటు రాష్ట్ర ప్రజలు కూడా మద్దతు తెలపాలని కోరుతున్నారు.

ఆపేయడం మేలు

అయితే, అమ‌రావ‌తి లో జ‌రుగుతున్న ఆందోళ‌న‌ల‌పై సోష‌ల్ మీడియాలో కొత్త కామెంట్లు వినిపిస్తున్నాయి. అమ‌రావ‌తిలో రైతులు ఆందోళ‌న చేయ‌డం లేద‌ని కేవ‌లం కొంద‌రే నిర‌స‌న తెలుపుతున్నార‌ని ప‌లువురు పేర్కొన్నారు. రైతుల ఆందోళ‌న అంటే ఢిల్లీ వంటి రూపం ఉంటుంద‌ని , అన్ని వ‌ర్గాల మ‌ద్ద‌తు అందుతుంద‌ని కామెంట్ చేశారు. రైతుల నిజ‌మైన ఆందోళ‌న కాబ‌ట్టే ఢిల్లీ నిర‌స‌న‌ల‌కు దేశ‌వ్యాప్తంగా ప్ర‌తిప‌క్ష పార్టీలు, ప్ర‌జా సంఘాలు, విద్యార్థులు మ‌ద్ద‌తు ఇస్తున్నార‌ని అమ‌రావ‌తి నిర‌స‌న‌లు అలాంటి ల‌క్ష‌ణాన్ని క‌లిగి ఉండ‌నందు వ‌ల్ల మ‌ద్ద‌తు పొంద‌లేక‌పోతున్నాయ‌ని…. అందుకే ఇక ఆందోళ‌న‌లు ఆపేయాల‌ని పేర్కొన్నారు.
న్ని వదిలిపెట్టబోమంటున్నారు రాజధాని ప్రాంత రైతులు. అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించే వరకు ఉద్యమాన్ని ఆపేది లేదని తేల్చిచెబుతున్నారు. ఎన్నాళ్లైనా అలుపెరగని పోరుతో ఆందోళనలు కొనసాగిస్తామని స్పష్టంచేశారు.

 

author avatar
sridhar

Related posts

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!