తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. కేంద్ర జల్శక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్తో సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. దాదాపు గంటపాటు సీఎం కేసీఆర్ షెకావత్ నివాసంలో ఆయనతో వివిధ అంశాలు ప్రస్తావించారు.
రాష్ట్రంలోని నీటి పారుదల ప్రాజెక్టులు, కేంద్ర సహకారంపై సీఎం కేంద్ర మంత్రితో చర్చించినట్లు సమాచారం. అయితే, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ పర్యటనపై సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి హాట్ కామెంట్లు చేశారు.
కేసీఆర్ , బీజేపీ మధ్య చీకటి ఒప్పందం
తెలంగాణ కేసీఆర్, బీజేపీ మధ్య రహస్య ఒప్పందం ఉందంటూ మీడియా చిట్చాట్లో జగ్గారెడ్డి విమర్శించారు. సీఎం కేసీఆర్, బీజేపీ నేతల మధ్య చీకటి ఒప్పందం ఉందని ఆరోపించారు. తెలంగాణ గల్లీల్లో ప్రధాని నరేంద్ర మోడీ తిడతారు.. కానీ, ఢిల్లీలో అమిత్షాతో మంతనాలు జరుపుతారని ఎద్దేవా చేసిన జగ్గారెడ్డి హైదరాబాద్లో నిర్మిస్తున్న కొత్త సచివాలయాన్ని సమర్థించుకోవడానికే ప్రధాని నరేంద్ర మోడీ తలపెట్టిన కొత్త పార్లమెంట్ భవనానికి తెలంగాణ సీఎం కేసీఆర్ మద్దతు పలికారంటూ సెటైర్లు వేశారు. సిద్ధిపేట టూర్లో హరీష్రావును ఉద్దేశించిన కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ హరీష్ సిద్దిపేటకు ఆణిముత్యం కావొచ్చు కానీ, ఉమ్మడి జిల్లాకు ఆణిముత్యం కాదని మండిపడ్డారు.
మూడు రోజుల పర్యటనలో ఏం జరగనుందంటే…
మూడురోజుల పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్ శుక్రవారం ఉదయం ఢిల్లీకి వెళ్లిన సంగతి తెలిసిందే. తొలిరోజు కేంద్ర జల్శక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్తో సీఎం కేసీఆర్ తెలంగాణకు నష్టం చేకూర్చేలా ఉన్న రాయలసీమ ఎత్తిపోతల పథకంపై అభ్యంతరాలు తెలిపినట్లు తెలిసింది. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నిత్యం 3 టీఎంసీల నీటిని ఎత్తిపోసేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. ప్రస్తుతం 2 టీఎంసీల నీటిని ఎత్తిపోసేందుకు అనుమతులున్నాయి. ప్రస్తుతం సీఎం కేసీఆర్ అమిత్ షాతో భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలపై ఆయనతో చర్చించనున్నట్లు తెలుస్తోంది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?