తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు కరోనా ఎంత సెన్సేషనల్ అయిందో…ఓ యువతి ఆరోపణ అంతే సంచలనం సృష్టించింది. 139 మంది తనపై అత్యాచారం చేశారని ఓ యువతి ఇటీవలే పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కేసు ఫైల్ చేసిన సంగతి తెలిసిందే.
ఈ కేసులో అనేక మంది సెలెబ్రిటీలు కూడా ఉన్నారని ఇటీవలే బాధితురాలు స్వయంగా పేర్కొన్నది. దీంతో ఈ కేసును సీసీఎస్ కు బదిలీ చేశారు. సీసీఎస్ పోలీసులు కేసును వేగవంతం చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ప్రతిరోజూ కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
అసలేం జరిగింది?
ఇటీవల ఓ యువతి పంజాగుట్ట పోలీసులకు ఓ సంచలన ఫిర్యాదు చేసింది. 139 మంది తనపై అత్యాచారం చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారిలో ప్రముఖ యాంకర్ ప్రదీప్, నటుడు కృష్ణుడు లేడని ప్రకటించింది. ఈ అంశం తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించింది. ఈ ఇద్దరు ప్రముఖులు మీడియా ముందుకు వచ్చి ఆ అమ్మాయికి, తమకూ ఏ సంబంధం లేదంటూ ప్రకటించారు. అనవసర వివాదం అంటూ వాపోయారు.
ఇప్పుడు మాట మార్చేసింది
తెలుగు రాష్ట్రాల్లో ఈ ఉదంతం సంచలనం సృష్టిస్తున్న తరుణంలో బాధితురాలు తాజాగా యు టర్న్ తీసుకుంది.. తొమ్మిదేళ్లుగా తనపై పలువురు అత్యాచారం చేసిన మాట నిజమే అయినా వారిలో ప్రముఖ యాంకర్ ప్రదీప్, నటుడు కృష్ణుడు లేడని తేల్చి చెప్పింది. హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన బాధితురాలు . వివిధ కుల సంఘాలు, మహిళా సంఘాలతో కలిసి మీడియాతో మాట్లాడింది. తనని 139 మంది రేప్ చేయలేదని, తన ఫ్యామిలీని చంపేస్తానని డాలర్ బాయ్ బెదిరించి కేసును తప్పుదోవ పట్టించాడని బాధితురాలు పేర్కొంది. 139 మంది అత్యాచారం కేసులో ప్రముఖ యాంకర్ ప్రదీప్, నటుడు కృష్ణుడు లేరనీ, ఆరోపణలకు చేసిన మహిళ వెల్లడించింది. డాలర్ బాయ్ ఒత్తిడి వలనే కేసులో యాంకర్ ప్రదీప్ పేరు చేర్చినట్టు ఆమె తెలిపింది. డాలర్ బాయ్ తన పట్ల సైకోలా వ్యవహరించాడని తెలిపింది. తనతో ప్రమేయం లేనివారిపై కూడా కేసులు పెట్టించాడని ఆరోపించింది. మొత్తం డాలర్ భాయ్ తన పట్ల సైకోలా వ్యవహరించాడనీ, చిత్రహింసలకు గురి చేసి తన చేత తప్పుడు ఆరోపణలు చేయించాడని పేర్కొంది.
వాడు చేయబట్టే ఆమె ఇలా చేసిందంట….
తనపై లైంగిక దాడి జరిగిన మాట వాస్తవమే అని, కానీ సెలెబ్రిటీలు కాదని బాధితురాలు పేర్కొన్నది. సెలెబ్రిటీలు తన వలన అనవసరంగా ఇబ్బందులు పడ్డారని, వారికి క్షమాపణలు చెప్తున్నానని బాధితురాలు తెలియజేసింది. బయట 50 శాతం వేధింపులకు గురైతే, డాలర్ బాయ్ వలన 50శాతం వేధింపులకు గురైనట్టు బాధితురాలు పేర్కొంది. డాలర్ బాబు ఊరఫ్ శ్రీకర్ రెడ్డి తనను బెదిరించి, బ్లాక్ మెయిల్ చేసి కేసులు పెట్టించాడని, ప్రముఖుల పేర్లు వద్దని చెప్పిన తనను చంపుతానని బెదిరించి వారి పేర్లను చేర్చించాడని తెలిపింది.. ఈ కేసులో పోలీసుల విచారణకు తాను పూర్తి స్థాయిలో సహకరిస్తానని పేర్కొంది. తనను కొట్టి సెలబ్రిటీలతో ఫోన్లో మాట్లాడించాడని వెల్లడించింది. నాతో పాటు మరో ఇద్దరు అమ్మాయిలను కూడా ట్రాప్ చేశాడని వెల్లడించింది.
మంద కృష్ణ సంచలన వ్యాఖ్యలు
ఈ సమావేశంలో మాట్లాడిన మంద కృష్ణ మాదిగ పెళ్లైన తరువాత బాధితురాలు తన జీవితంలో జరిగిన నాలుగు ఘటనలు వివరించిందని చెప్పారు. 139 మందిలో 30 శాతం మంది అమ్మాయిని దారుణంగా అత్యాచారం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకో 30 శాతం అమ్మాయిని మానసికంగా వేధించి బ్లాక్ మెయిల్ చేశారని అన్నారు. దాదాపు 40 శాతం మందికి ఈ కేసుతో సంబంధం లేని వాళ్లు ఉన్నారని పేర్కొన్నారు. ఎస్ఎఫ్ఐకి చెందిన మీసాల సుమన్ ఈ అమ్మాయి జీవితంలోకి ఎప్పుడైతే ప్రవేశించాడో అప్పుడే అమ్మాయి బ్లాక్ మెయిల్కు గురైందని తెలిపారు. డాలర్ బాబు అమ్మాయితో కేసులు పెట్టించి వారిని బ్లాక్మెయిల్ చేశాడని మంద కృష్ణ చెప్పారు. మీసాల సుమన్, డాలర్ బాబును అదుపులోకి తీసుకుంటే అన్ని నిజాలు బయట పడుతాయన్నారు. బాధితురాలికి ప్రాణహాని ఉంది రక్షణ కల్పించాలిఅని మందకృష్ణ డిమాండ్ చేశారు. కాగా, తమ అభిమాన యాంకర్ను ఇలా రోడ్డు పాలు చేసినందుకు ఆమె క్షమాపణలు చెప్పాలని ప్రదీప్ అభిమానులు కోరుతున్నారు.