ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురించి ఓ సంచలన గుసగుస వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో కొందరు దాన్ని ప్రచారం చేశారు. ఈ నేపథ్యంలో ఏపీ మంత్రి కొడాలి నాని మరో సారి ఫైర్ అయ్యారు.
వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉండటం కొంతమందికి ఇబ్బందిగా ఉందని పేర్కొన్నారు. కొందరు కావాలనే ఛానళ్లలో సీఎం జగన్ పై అసత్య ప్రచారాలు చేపిస్తున్నారని ఫైర్ అయ్యారు.
కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు
టీడీపీ అధినేత నారా చంద్రబాబును విమర్శించడంలో ఎప్పుడు ముందు వరుసలో ఉండే కొడాలి ..ఇవాళ మీడియా సమావేశంలోనూ విరుచుకుపడ్డారు. గత ముఖ్యమంత్రి చంద్రబాబు కొన్ని మీడియాలతో కుమ్మకై సొంత డబ్బా కొట్టుకున్నారని మండి పడ్డారు. చంద్రబాబు పాలనలో ఇష్టం వచ్చినట్లు రాష్ట్రాన్ని దోచుకున్నారని విమర్శించాడు. సీఎం జగన్ను ముఖ్యమంత్రి పదవి నుంచి దించేందుకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వంటి ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టారని అసత్య ప్రచారం మొదలు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు లాంటి వెన్నుపోటు రాజకీయాలు వైసీపీ పార్టీలో జరగవని స్పష్టం చేశారు. సీఎం వైఎస్ ఎంతో కష్టపడితే.. ప్రభుత్వం ఏర్పడిందని స్పష్టం చేశారు. ఆయనను సీఎం నుంచి దించేస్తే ఏపీ ప్రజలు చూస్తూ ఊరుకోరన్నారు.
జగన్ను వెన్నుపోటు పొడవలేరు
ఈ సందర్భంగా గతంలో జరిగిన పలు సంధర్భాలను కొడాలి నాని ఉదహరించారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడిచి చంద్రబాబు సీఎం అయిన తర్వాత రాష్ట్రంలో ఏం జరిగిందో ప్రజలకు తెలుసునని గుర్తుచేశారు. ఇకనైనా చంద్రబాబు బుద్ది మార్చుకోవాలని హితవు పలికారు. అలాంటి సంఘఠనలకు తమ పార్టీలో చోటు ఉండదని కొడాలి నాని స్పష్టం చేశారు.