ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న భారీ ప్రాజెక్ట్స్ లో ఎప్పటికప్పుడు అత్యంత క్రేజీ ప్రాజెక్ట్ గా అంచనాలు పెరుగుతున్న సినిమా సర్కారువారి పాట. టైటిల్ తోనే ఈ సినిమా మీద ఊహించని అంచనాలు పెరిగిపోయాయి. ఇక టైటిల్ తో పాటు మహేష్ ప్రీలుక్ రిలీజ్ తర్వాత మహేష్ కి చాలా ఏళ్ళకి సరైన సినిమా పడిందన్న టాక్ మొదలైంది.
మహేష్ కెరీర్ లో 27 వ సినిమాగా రూపొందబోతున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించబోతుంది. జి.ఎం.బి.ఎంటర్టైన్మెంట్స్, 14 రీల్స్, మైత్రీ మూవీస్ నిర్మాణ సంస్థ లు ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొంచనున్నారు. యూనివర్సల్ కాన్సెప్ట్ తో తెరకెక్కబోతున్న ఈ సినిమాకి ఇప్పటికే అమెరికాలో లొకేషన్స్ ని ఫైనల్ చేశారు చిత్ర యూనిట్. నవంబర్ నుంచి షూటింగ్ మొదలవబోతుండగా 45 రోజుల సింగిల్ షెడ్యూల్ ని ప్లాన్ చేశారు. ఈ షెడ్యూల్ లో 50 శాతం సినిమా షూటింగ్ కంప్లీట్ చేయనున్నారు. మహేష్ బాబు, కీర్తి సురేష్ తో పాటు ప్రధాన తారాగణం కూడా ఈ ఫారిన్ షెడ్యూల్ లో పాల్గొనబోతున్నారు.
జనవరి లో తిరిగి ఇండియాకి చేరుకొని మిగతా టాకీ పార్ట్ అండ్ సాంగ్స్ కంప్లీట్ చేసి 2021 సమ్మర్ సినిమాని పాన్ ఇండియన్ లెవల్ లో సినిమాని రిలీజ్ చేయనున్నారట. అంతేకాదు ఇండియాలో ప్లాన్ చేసే నెక్స్ట్ షెడ్యూల్ కూడా లాంగ్ షెడ్యూల్ నే ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. మహేష్ కూడా ఈ సినిమా కంప్లీట్ చేసేంతవరకు మరో ప్రాజెక్ట్ గురించి ఆలోచించడం లేదట.
అంతేకాదు ఈ సినిమా గురించి ఒక లేటెస్ట్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ముఖ్యంగా మహేష్ లుక్ మీద చాలామంది ఎగ్జైట్ అయిన సంగతి తెలిసిందే. లాంగ్ హేయిర్ తో చాలా ఏళ్ళ తర్వాత మళ్ళీ సర్కారు వారి పాట లో కనిపించబోతున్నాడని భావించారు. అయితే ఈ సినిమాలో మహేష్ రెండు రకాల గెటప్ లలో కనిపిస్తాడని తెలుస్తుంది. అంటే ఇది డ్యూయల్ రోల్ ఆ అని టాక్ మొదలైంది. చూడాలి మరి ఇంకా ఎన్ని సర్ప్రైజెస్ ఉన్నాయో.
Bigg Boss Ashwini: రాత్రి 4 అయినా నిద్ర పట్టడం లేదు… బోల్డ్ కామెంట్స్ చేసిన బిగ్ బాస్ అశ్విని..!