గత కొద్దిరోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపుతున్న నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు కు వైసిపి షోకాజ్ నోటీసులు జారీ చేసింది. వైసిపి ప్రధాన కార్యదర్శి హోదాలో విజయసాయిరెడ్డి కృష్ణం రాజు గారికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు.
గత పది రోజులుగా పార్టీ అధిష్టానానికి వ్యతిరేకంగా రాజు గారు చేస్తున్న తీవ్ర వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని మరియు ఒక నివేదికలో అతని అభిప్రాయాన్ని పేర్కొనాలని షోకాజ్ నోటీసులలో స్పష్టంగా సాయి రెడ్డి పేర్కొన్నాడు.
ఇకపోతే కృష్ణంరాజు గత కొద్దిరోజులుగా ఏపీ ముఖ్యమంత్రి మరియు వైసీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ని టార్గెట్ చేస్తూ పలు కులపరమైన ఆరోపణలు చేయడం మరియు అతని ప్రభుత్వ వ్యవహారలలో తప్పులు ఉన్నాయి అంటూ తీవ్రమైన విమర్శలు చేయడం చూస్తూనే ఉన్నాం.
దీనికి వైసిపి ఎట్టకేలకు ఫుల్ స్టాప్ పెట్టాలని అతనిపై యాక్షన్ తీసుకునేందుకు చర్యలు ప్రారంభించింది. ఇక దీనికి బదులుగా కృష్ణంరాజు ఏం చేస్తారన్నది ఇప్పుడు రాష్ట్ర ప్రజలందరిలో ఆసక్తి రేకెత్తిస్తున్న అంశం.