Shruthi hassan : శృతి హాసన్ Shruthi hassan తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ప్రస్తుతం విపరీతమైన పాపులారిటీ ని సంపాదించుకుంది. తండ్రి కమల్ హాసన్ మాదిరిగానే శృతి హాసన్ కూడా నటిగా, గాయనిగా, మ్యూజిక్ కంపోజర్ గా మల్టీ టాలెంటెడ్. తనకు తను కమల్ హసన్ కూతురు అని కాకుండా ఒక ప్రత్యేకమైన గుర్తింపు కోసం చాలా కష్టపడి పాపులారిటీని సంపాదించుకుంది. కెరీర్ ప్రారంభంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనప్పటికి ఛాలెంజింగ్ గా తీసుకొని వాటిని అధిగమించి హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ సరసన “గబ్బర్ సింగ్” సినిమాలో నటించి భారీ విజయాన్ని సాధించడమే కాక విమర్శకుల ప్రశంసలు అందుకుంది.
ఇక ప్రేక్షకుల దృష్టిలో.. మేకర్స్ దృష్ఠిని ఆకట్టుకిని తన స్థాయిని పెంచుకుంది. ఈ క్రమంలో తెలుగులో మాస్ మహారాజా రవితేజ సరసన “బలుపు”, జూనియర్ ఎన్.టి.ఆర్. సరసన “రామయ్యా వస్తావయ్యా” మెగా పవర్ స్టార్ రాం చరణ్ సరసన ఎవడు వంటి సూపర్ హిట్ సినిమాలో నటించింది. టాలీవుడ్ లో నే కాకుండా కోలీవుడ్ లో కూడా భారీ బడ్జెట్ సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్ గా మారింది. ఇక రీసెంట్ గా క్రాక్ సినిమా సక్సస్ ను సెలెబ్రేట్ చేసుకుంటుంది. మూడేళ్ళ తర్వాత క్రాక్ తో సాలీడ్ హిట్ అందుకున్న శృతి అనూహ్యంగా ప్రభాస్ సలార్ లో నటించే అవకాశం దక్కించుకుంది.
Shruthi hassan : స్త్రీ స్వేచ్ఛ కి, ఎమోషన్స్ కి దగ్గరగా ఉన్న పాత్ర..!
శృతి హాసన్ సినిమాలు చేస్తూనే ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో నాలుగు విభిన్నమైన కథల సమాహారంగా రూపొందిన పిట్టకథలు ఆంథాలజీ వెబ్ సిరీస్ లో కూడా నటించింది. నాలుగు విభిన్నమైన కథాంశాలతో ఈ వెబ్ సిరీస్ తెరకెక్కింది. జగపతి బాబు, సత్య దెవ్, ఈషా రెబ్బా మంచు లక్ష్మీ, లాంటి ప్రముఖులతో బోల్డ్ కంటెంట్ తో స్క్రీన్ షేర్ చేసుకుంది శృతి హాసన్. ఈ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో ఫిబ్రవరి 19 నుంచి స్ట్రీమింగ్ కానుంది. రీసెంట్ గా ట్రైలర్ రిలీజై ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. కాగా ఈ వెబ్ సిరీస్ లో శృతి బోల్డ్ గా నటించింది. అయితే అలాంటి పాత్ర ఒప్పుకోవడానికి ఒక మహిళగా తాను ఈ స్టోరీకి బాగా కనెక్ట్ అయ్యానని.. అదే ఈ సినిమా చేయడానికి ప్రధాన కారణమని శృతి చెప్పింది. స్త్రీ స్వేచ్ఛ కి, ఎమోషన్స్ కి దగ్గరగా ఉన్న పాత్ర కావడం వల్ల తన నటనకు స్కోప్ ఉంది కాబట్టే అలాంటి పాత్ర చేయాలని శృతి అభిప్రాయపడ్డరని తెలుస్తుంది.