Shyam Singha Roy: ఇటీవల లెజండరీ లిరిక్స్ రైటర్ సిరివెన్నెల సీతారామ శాస్త్రి అనారోగ్యంతో కన్ను మూసిన సంగతి తెలిసిందే. ఆయన ఆఖరి సమయంలో రాసిన ఆఖరి పాట సిరివెన్నెల. ఆయన పేరు మీదే తన చివరి పాట రాయడం యాదృచ్చికం. రాయలేనేమో అంటూనే ఈ పాట పూర్తి చేసివ్వడం నాని నటించిన శ్యామ్ సింగ రాయ్ చిత్ర బృందానికి మాత్రమే దక్కిన గొప్ప అదృష్ఠం. నేచురల్ స్టార్ నాని, సాయి పల్లవి, కృతి శెట్టి హీరో హీరోయిన్స్గా నటించిన ఈ సినిమా డిసెంబర్ 24న భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగుతున్న నేపథ్యంలో తాజాగా సిరివెన్నెల రాసిన పాటను చిత్రబృందం విడుదల చేసింది. ‘నెలరాజుని.. ఇలరాణి.. కలిపింది కదా సిరివెన్నెలా.. దూరమా.. తీరమై చేరుమా..’ అంటూ సాగిన ఈ మెలోడీ సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇక ఈ సాంగ్ నాని – సాయి పల్లవిల ప్రేమకథను తెలియజేసేలా ఉంది. ఈ సినిమాలో వారిద్దరిని కలిపేదే సిరివెన్నెల చివరి పాట అని తెలుస్తోంది. ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి ఈ పాటకు అందించిన సాహిత్యం ప్రేమ యొక్క లోతైన అర్థాన్ని తెలుపుతోంది.
Shyam Singha Roy: ఇందులో విజువల్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.
ఇక ఈ సినిమాకు మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నాడు. కాగా, తాజాగా విడుదలైన సిరివెన్నెల చివరి పాటను యువ గాయకుడు అనురాగ్ కులకర్ణి మంచి ఫీల్తో పాడాడు. ఇందులో విజువల్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. కలకత్తా నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాను భారీ బడ్జెట్తో నిహారిక ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై వెంకట్ బోయినపల్లి నిర్మించారు. నాని కెరీర్లోనే ఇది భారీ బడ్జెట్ సినిమా కావడం విశేషం. ఇక గత కొంతకాలంగా నానికి భారీ కమర్షియల్ హిట్ దక్కలేదు. శ్యామ్ సింగ రాయ్ సినిమాతో ఆ హిట్ సాధించబోతున్నాడని చాలా నమ్మకంగా ఉన్నాడు.