వికారాబాద్: న్యూ ఇయర్ రోజు తాగుబోతులు మద్యం మత్తులో రెచ్చిపోయారు. కారుతో బీభత్సం సృష్టించారు. వికారాబాద్ లోని నవాబ్ పేట్ ఎస్సైని కొందరు యువకులు కారుతో ఢీ కొట్టారు. న్యూ ఇయర్ కావడంతో.. అనంతగిరి సమీపంలో నవాబ్పేట ఎస్సై కృష్ణ తన సిబ్బందితో కలిసి విధులు నిర్వహిస్తున్నాడు. అర్ధరాత్రి వాహనాలు తనిఖీ చేస్తోన్న సమయంలో నలుగురు యువకులు వారి కారును ఆపకుండా నేరుగా పోలీసులను ఢీకొట్టారు. ఈ ఘటనలో ఎస్ఐ తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం ఆయనను సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మద్యం మత్తులో నలుగురు ఈ ఘటనకు పాల్పడ్డారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఓ ప్రైవేట్ రిసార్ట్లో తప్పతాగిన యువకులు.. నిర్లక్ష్యంగా కారు నడిపినట్లు తెలుస్తోంది. యువకులు ఉద్దేశ పూర్వకంగానే ఈ ఘటనకు పాల్పడ్డారా? అన్న విషయంపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. నిందితులు టోలీచౌక్ కు చెందిన ఇమ్రాన్, అన్వర్, నవీద్, సమీర్ గా పోలీసులు గుర్తించారు. నిందితులు డ్రగ్స్ తీసుకున్నట్లు వికారాబాద్ డీఎస్పీ తెలిపారు.
previous post
next post