బెంగుళూరు(కర్నాటక),జనవరి 21: సిద్ధగంగ మఠాధిపతి శివకుమార స్వామి(111) శివైక్యం చెందారు. స్వామి కొంత కాలంగా ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్నారు. బెంగుళూరులోని సిద్ధగంగ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న ఆయన సోమవారం ఉదయం 11.44గంటలకు పరమపదించారు.
ఆయన గత రెండు వారాలనుండి ఆస్పత్రిలో వెంటిలేటర్పై ఉన్నారు.
మంగళవారం సాయంత్రం 4.30 గంటలకు స్వామి అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
స్వామి మృతిపట్ల కర్నాటక ముఖ్యమంత్రి కుమారస్వామి, భారతీయ జనతాపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డయ్యూరప్పలు సంతాపం వ్యక్తం చేశారు.
ఆయన్ను నడిచే దేవుడిగా కర్నాటకలో పేరుగాంచారు. విద్య, వైద్య రంగాలకు ఆయన మఠం తరపున అనేక సేవా కార్యక్రమాలను చేపట్టారు.
previous post
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?