కరోనా చికిత్సకు ఆయుర్వేద మందుని విడుదల చేస్తూ బాబా రాందేవ్ ఆ మధ్య కొంత హడావిడి చేసారు. తన సంస్థ పతంజలి ద్వారా “కరోనీల్” అనే మందుని విడుదల చేసారు. ఇదే బాటలో ఇప్పుడు ఆర్ట్ అఫ్ లివింగ్ ఫౌండర్ శ్రీ శ్రీ రవి శంకర్ కూడా ఉన్నారు. ఆయుర్వేదం, సిద్ధ విధానాల ద్వారా కరోనా చికిత్సకు కొత్త మందుని విడుదల చేసారు.జర్మనీకి చెందిన ఫ్రాంక్ఫర్ట్ ఇన్నోవేషన్ సెంటర్ ఫర్ బియో టెక్నాలజీ” అనే సంస్థ ద్వారా ఈ మందుని ప్రయోగాత్మకంగా పరిశీలించినట్టు సంస్థ వెల్లడించింది. శరీరంలో రోగనిరోధక వ్యవస్థపైనా, నాదీ వ్యవస్థపైనా ఈ మందు బాగా పని చేస్తున్నట్టు చెప్పింది.
సోమవారం వర్చ్యువల్ కాన్ఫరెన్స్ ద్వారా రవిశంకర్ మాట్లాడుతూ కరోనా చికిత్స నివారణకు ఎంతో ఉపయోగపడుతుంది అని చెప్పారు. ఈ మందును మినిస్టరీ అఫ్ యోగ, ఆయుర్వేదం, ప్రకృతి వైద్యం, యునాని , సిద్ధ వైద్యం, హోమియోపతి వారికి ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపారు. కరోనా వ్యాప్తి తీవ్రతం అవడంతో ఆసుపత్రిలో పడకల సంఖ్యా కూడా తగ్గిపోయింది, అనే విషయాన్ని గ్రహించాము అని ఆయన అన్నారు. “మేము పురాతన ఆధునిక చికిత్సా విధానాల మధ్య విభజనను సృష్టించడం లేదు అని, ఇది సమగ్ర విధానాన్ని అవలంబించే సమయం అని అయినా పేర్కొన్నారు.
తత్వ చీఫ్ ఆఫీసర్ రవి రెడ్డి మాట్లాడుతూ, ” కబసూర్ కుడినిర్, అమృత్, ఇమ్మ్యూజిన్, చావనప్రశ్ వంటి తత్వ ప్రొడక్ట్స్ ఇన్-విట్రో అధ్యయనాలకు సంబంధించిన ఫలితాలు అని తెలిపారు. శాస్త్రీయ సిద్ధ వైద్యంతో కూడిన కబసూర్ కుడినిర్ టాబ్లెట్, ఇతర ఆయుర్వేద ఔషాదాలతో పాటు SARS-CoV-2 యొక్క స్క్రీనింగ్ ఇన్హిబిటర్లను పరీక్షించారు. ఇన్-విట్రో అధ్యయనాలలో కణాలలోకి వైరస్ ప్రవేశించడాన్ని పరిమితం చేయడంలో కరోన వైరస్ జాతులలో స్పైక్ గ్లైకోప్రొటీన్ బలమైన నిరోధకం కబసురా కుడినీర్ మాత్రలు అని అధ్యయనం కనుగొంది” అనే విషయాన్ని మీడియా తో తెలిపారు.
సంస్థ తెలిపిన వివరాల ప్రకారం, అమృత్,ఇమ్యుగెన్ ఒకే విధమైన నిరోధక ప్రభావాలను కలిగి ఉన్నాయి – వరుసగా 60-65 శాతం నుండి 80 శాతం – బైండింగ్ గల బలమైన తగ్గింపును చూపుతుంది. చివాన్ప్రాష్ 70-75 శాతం మధ్య, ఏ విధమైన సాంద్రతలను పరీక్షించినా ఇలాంటి నిరోధక స్థాయిలను చూపించింది, అని తెల్పింది. ఈ శాతాలు వైరస్ కణంలోకి ప్రవేశించే మార్గాలను బంధించడంలో ప్రతి ఔషధ నిరోధక సామర్థ్యాన్ని సూచిస్తాయని రెడ్డి వివరించారు. “ఉత్పత్తులను ఉపయోగించడం నిరోధక ప్రభావాన్ని కలిగి ఉందని ఫలితాలు చూపిస్తాయి, తద్వారా కణంలోకి వైరస్ ప్రవేశించే అవకాశాలను తగ్గిస్తుంది” అని అతను చెప్పారు.
“కోవిడ్ 19 కు వ్యతిరేకంగా రోగనిరోధక శక్తిని పెంచుతుంది” అని పేర్కొన్న మూలికా ఉత్పత్తులపై చేసిన ఇతర అధ్యయనాలను కూడా కంపెనీ పంచుకుంది. ఏది ఏమయినప్పటికీ, పరిశోధనలను ధృవీకరించడానికి ఇతర విద్యావేత్తలు, పరిశోధకులు నిర్వహించిన పరిశోధన మూల్యాంకనం ప్రక్రియను పీర్-రివ్యూ కోసం పంపాలని కంపెనీ యోచిస్తోందా అనే ప్రశ్నకు మాత్రం, సంస్థ స్పందించలేదు.