కరోనా బారిన పడ్డ పేషెంట్లకు ప్రస్తుతం అనేక రకాలుగా చికిత్స అందిస్తున్నారు. చాలా మంది అల్లోపతి మెడిసిన్ను తీసుకుంటున్నారు. అయితే తమిళనాడులో కొందరు పేషెంట్లకు సిద్ధ వైద్యం అందిస్తున్నారు. దీంతో వారు కరోనా నుంచి త్వరగా కోలుకుంటున్నారు. ఆగస్టు 7వ తేదీ వరకు మొత్తం 5,725 మంది కరోనా పేషెంట్లు కోలుకున్నారు. వారందరికీ సిద్ద వైద్యం చేశారు.
తమిళనాడులోని చెన్నై సిద్ధ కోవిడ్ 19 కేర్ సెంటర్లలో రోగులకు సిద్ధ వైద్యం అందిస్తున్నారు. అక్కడి జవహర్ విద్యాలయ, డాక్టర్ అంబేద్కర్ ప్రభుత్వ ఆర్ట్స్ కాలేజీలలోనే 3200 మంది పేషెంట్లకు సిద్ధ వైద్యం చికిత్స అందించారు. ఇక మరో 434 మంది పేషెంట్లకు మరో రెండు సెంటర్లలో సిద్ధ వైద్యం అందిస్తున్నారు. 715 మంది పేషెంట్లు తమిళనాడులోని పలు జిల్లాల్లో సిద్ధ వైద్య సెంటర్లలో కోవిడ్ చికిత్స తీసుకుంటున్నారు.
చెన్నైకి సమీపంలోని వెల్లూర్లో ఉన్న సిద్ధ వైద్య సెంటర్లో 1258 చికిత్స పొందుతున్నారు. వీరందరూ మెడిసిన్ తీసుకున్న 2 లేదా 3 రోజులకే అనేక లక్షణాల నుంచి బయట పడ్డారని అధికారులు తెలిపారు. కాగా సిద్ధ వైద్య సెంటర్ వారు తయారు చేసిన ఓ ఆయుర్వేద ఔషధాన్ని ఇప్పుడు తమిళనాడులో అనేక చోట్ల అత్యవసర సేవలను అందిస్తున్న సిబ్బందికి నిత్యం ఇస్తున్నారు. దీని వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. తద్వారా కోవిడ్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి.
కాగా సిద్ధవైద్యం చికిత్స అందించేందుకు గాను తమిళనాడు సీఎం పళనిస్వామి ఆరోగ్యం పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందుకు కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ నుంచి అనుమతి పొందారు. అలాగే సిద్దవైద్యం కాకుండా హోమియోపతి, యునాని, యోగా, నాచురోపతి వైద్య విధానాల ద్వారా కూడా అక్కడ పలువురు కోవిడ్ పేషెంట్లకు చికిత్సను అందిస్తున్నారు.