Sidhu Moose Wala: దివంగత ప్రముఖ పంజాబ్ గాయకుడు సిద్దూ మూసేవాలా ఆఖరుగా పాడిన ఎస్ వై ఎల్ (సట్లజ్ యమూనా అనుసంధానం) పాట ను యూట్యూబ్ తొలగించింది. కేంద్ర ప్రభుత్వ ఫిర్యాదుతో యూట్యూబ్ భారతదేశ ఫ్లాట్ ఫామ్ నుండి ఈ పాటను తొలగించింది. ఎస్ వై ఎల్ పాట ఇతర దేశాల్లో అందుబాటులో ఉంది. పంజాబ్ రాష్ట్రానికి సంబంధించి నీటి సమస్య గురించి ఈ పాటలో ఉంది. సట్లేట్, యమునా లింక్ గురించి కూడా ప్రస్తావించారు సిద్దూ మూసేవాలా. చాలా కాలంగా పంజాబ్, హర్యానా రాష్ట్రాల మధ్య అసమ్మతికి కారణమైంది.
- Read the latest news in Telugu from AP and Telangana’s most trusted news website.
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
గత నెల 29న సిద్దూ మూసేవాలా గ్యాంగ్ స్టర్ కాల్పుల్లో మరణించిన సంగతి తెలిసిందే. సిద్దూ మరణానికి ముందు చివరిగా ఈ వై ఎల్ పాటను స్వంతంగా స్వరపరిచారు. ఈ పాట వీడియోలో 1984 సిక్కు వ్యతిరేక అల్లర్ల గురించి, రైతుల ఆందోళన సమయంలో ఎర్రకోటపై సిక్కు జెండాను ఎగురవేసిన సన్నివేశాలు ఉన్నాయి. అప్ లోడ్ చేసిన వెంటనే ఈ పాట యూట్యూబ్ లో 27 మిలియన్ల కు పైగా వ్యూస్, 3.3 మిలియన్ లైక్ లు పొందింది. అయితే ఈ వీడియో కంటెంట్ పై ప్రభుత్వం నుండి న్యాయపరమైన ఫిర్యాదులు రావడంతో తొలగించినట్లు యూట్యూబ్ పేర్కొంది.