ప్రస్తుతం ఏపీలో హట్ టాపిక్క్ ఏమైనా ఉందంటే… కచ్చితంగా అది అమరావతిలోనే పూర్తి రాజధాని ఉంటుందా లేదా అన్న విషయం! అవును.. ఈ క్రమంలో జగన్ సకార్ తెరపైకి తెచ్చిన మూడు రాజధానుల బిల్లు, సీఆర్డీయే రద్దు బిల్లుల వ్యవహారంపై అందరిదృష్టీ కేంద్రీకృతమై ఉంది! ఈ క్రమంలో ఈ బిల్లులు గవర్నర్ పరిధిలో ఉన్నాయి! ఈ సమయంలోనే ఈ బిల్లులకు సంబందించిన ఒక ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది!
ఈ రెండు బిల్లులూ గవర్నర్ వద్దకు వెళ్లిన అనంతరం.. వాటిని న్యాయసలహాల నిమిత్తం తిరిగి ప్రభుత్వానికి పంపించారు గవర్నర్. ఇదే క్రమంలో గవర్నర్ కార్యాలయం కూడా న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతోందంటూ కథనాలు విన్పిస్తున్నాయి. ఎందుకంటే… హైకోర్టులో ఇప్పటికే ఈ బిల్లులపై పలు పిటిషన్లు దాఖలయ్యాయి. గవర్నర్ ఆమోదం పొందినా కూడా ఆ బిల్లులపై న్యాయ సమీక్షకు అవకాశం వుంటుందని న్యాయస్థానం తేల్చి చెప్పిన తరుణంలో… ఈ విషయంలో గవర్నర్ ఎంతో లోతుగా న్యాయ నిపుణులతో చర్చిస్తున్నారంట!
గవర్నర్ ఈ విషయంలో మరింత శ్రధ పెట్టడానికి.. నిమ్మగడ్డ వ్యవహారం కూడా కారణంగా చెబుతున్నారు! రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నియామకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్కి గవర్నర్ ఆమోద ముద్ర వేసిన అనంతరం.. దాన్ని న్యాయస్థానం కొట్టి పారేసిన సంగతి తెలిసిందే. దీంతో ఈసారి మరింత జాగ్రత్తగా న్యాయనిపుణుల సలహాలతో ముందుకు వెళ్లబోతున్నారంట!! సో.. ఇప్పుడు అధికారికంగా మూడు రాజధానుల బిల్లు గవర్నర్ పరిధిలోనే ఉన్నా… అంతకు మించి న్యాయనిపుణుల పరిధిలో ఉన్నట్లన్న మాట!!