Sid Sriram: సిద్ శ్రీరామ్… ఈమధ్య కాలంలో సింగర్స్ లో ఎక్కువగా వినిపిస్తున్న పేరు ఇది. ఆతను పడుతున్న ఒక్కో పాట కి యూత్ ఫిదా అయిపోతున్నారు. యు ట్యూబ్ లో అతని ఒక్కో పాటకి కొన్ని వందల మిలియన్ ల వ్యూ స్ వస్తున్నాయి. ప్రస్తుతం టాప్ సింగర్స్ జాబితాలో సిద్ శ్రీరామ్ టాప్ లో ఉన్నాడనే చెప్పాలి. అందుకే ప్రతి సినిమాలో కనీసం ఒక్క పాట అయినా అతనితో పాడించాలని హీరోలు, దర్శకులు, మ్యూజిక్ డైరక్టర్స్ చూస్తున్నరు. అతను ఒక పాట పాడాడు అంటే అది కచ్చితంగా సూపర్ డూపర్ హిట్ అయిపోతుంది.
ఇప్పటి వరకు సిద్ పాడిన ప్రతి పాట ఒక మ్యూజికల్ హిట్ అనే చెప్పాలి. అతను పాడిన ప్రతి పాట ఇంతలా హిట్ అవుతూ ఉండడంతో ప్రస్తుతం అతని డిమాండ్ కూడా బాగా ఉంది. ఆంతేకాకుండా అతను పాడిన పాట వలన వారి సినిమా కి ప్లస్ అవుతుంటే అతను అడిగినంత ఇవ్వడానికి నిర్మాతలు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నారు. ఈ క్రమంలో అసలు సిద్ శ్రీరాం ఒక్కో పాటకు ఎంత పారితోషికం తీసుకుంటున్నాడు అనేది హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ సిద్ ఒక్కో పాటకి గాను 6 లక్షలు తీసుకుంటున్నాడట. మొన్నటి వరకు గాన గంధర్వుడు సింగర్ బాల సుబ్రహ్మణ్యం గారు ఒక్క పాటకి 2 నుండి 3 లక్షలు పారితోషికం తీసుకుంటే ప్రస్తుతం సిద్ శ్రీరాం రూ. 6 లక్షలు రెమ్యునరేషన్ అందుకుంటున్నాడు.
సిద్ శ్రీరాం పాడుతున్న పాటలు ప్రేక్షకులను ముఖ్యంగా యూత్ ని మరింతగా ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం సిద్ పాడిన ‘నీలి నీలి ఆకాశం’ మరియు ‘ఒకే ఒక లోకం నువ్వే’ పాటలు ట్రెండ్ అవుతున్నాయి.
ఈ న్యూస్ ని మీ వాట్సాప్ మరియు ఫేస్ బుక్ లో ఉన్న ఫ్రండ్స్ అందరితో షేర్ చెయ్యండి. కిందనే ఉన్న షేర్ బటన్ ఉపయోగించి వెంటనే వారికి షేర్ చెయ్యండి.