Singer Sunitha:గత కొన్ని రోజులుగా సింగర్ సునీత పేరు కూడా జనాల నోటిలో బాగా నానుతుంది. సునీత సోషల్ మీడియాలో కొంచెం యాక్టివ్ అన్న సంగతి తెలిసినదే. ఇక అసలు విషయంలోకి వెళితే, మొన్ననే సునీత ఫస్ట్ యానివర్సరీ జరుపుకున్న సంగతి విదితమే. ఈ సందర్భంగా ఆమె ఓ వీడియో రిలీజ్ చేయడం, అది కాస్త వైరల్ అవ్వడం మనం చూశాం. సునీత రొండో సారి మ్యాంగో మీడియా అధినేత రామ్ ని వివాహం చేసుకుంది. వారి వివాహం అయిన ఒక్క సంవత్సరం సందర్భంగా వారు స్పందిస్తున్నారు.
RRR OTT: రాజమౌళికి అమెజాన్ కళ్ళు చెదిరే ఆఫర్..ఎంతో తెలిస్తే మతిపోద్ది!
Singer Sunitha: సునీత కుటుంబ నేపధ్యం ఇదే..
సునీత తండ్రి పేరు నరసింహారావు, తల్లి సుమతి అన్న సంగతి తెలిసినదే. ఇక వీరి స్వస్థలం గుంటూరు. ఈమె మేనత్త, చిన్నమ్మ దగ్గర ఈమె సంగీత పాఠాలు నేర్చుకుంది. సంగీతం వీరి కుటుంబాలలో కొన్ని తరాలుగా పరంపరగా వస్తోంది. ఈమె 15 సంవత్సరాల వయసులో మొదటి సారిగా సినిమాలలో నేపథ్య గాయనిగా ప్రవేశించింది. శశి ప్రీతం సంగీత దర్శకత్వంలో గులాబి సినిమా కోసం సిరివెన్నెల సీతారామశాస్త్రి రచించిన “ఈ వేళలో నీవు ఏం చేస్తు ఉంటావు” అనే పాడి ప్రేక్షకుల మనసులను దోచుకుంది.
Prabhas: ప్రభాస్పై ఆ నిర్మాత చేసిన షాకింగ్ కామెంట్స్కు ఫ్యాన్స్ కన్ఫ్యూజన్లో పడ్డారు..!
తన అల్లుడు రామ్ గురించి సింగర్ సునీత తండ్రి ఈ విధంగా మాట్లాడారు..
సునీత పై పాట ద్వారా ప్రజలకు బాగా చేరువయ్యింది. తరువాత ఈమె తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ భాషలలో సుమారు 3, 500 పైగా సినిమా పాటలు పాడింది. ఈమెకు 19 సంవత్సరాల చిరు ప్రాయంలోనే కిరణ్ తో వివాహమైనది. వీరికి ఇద్దరు పిల్లలు: అబ్బాయి ఆకాష్, అమ్మాయి శ్రేయ. అలాగే 7/12/2020లో వ్యాపారవేత్త అయిన మ్యాంగో మీడియా గ్రూప్ అధినేత రామ్ వీరపనేనినితో రెండవ వివాహం జరిగింది. పెళ్ళై ఒక సంవత్సరం అయిన సందర్భంగా సునీత తండ్రి అల్లుడి గురించి మీడియాతో మాట్లాడుతూ తెగ పొగిడేశారు.