దేశ రియల్ ఎస్టేట్ రంగాన్ని ఒక ఊపేసిన ఆదిత్య హోమ్స్ ఉదంతం ఒక కొత్త మలుపు తీసుకుంది. ఆదిత్య హోమ్స్ మేనేజింగ్ డైరెక్టర్ కోటారెడ్డి గురించి అతని బావమరిది సుధీర్ రెడ్డి కొన్ని ఆసక్తికరమైన విషయాలను బయట పెట్టాడు. ఏకంగా క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ భార్య అంజలి.. కోటా రెడ్డి చేతిలో మోసపోయిందని…. నిర్మాణానికి ఏమాత్రం అనువుగా లేని మరియు పర్మిషన్లు రాబట్టలేని భూములను 20 రెట్లు ఎక్కువ ధరకు తన బావ కోటారెడ్డి అంజలి తో సహా పలువురు ఇండస్ట్రీ ప్రముఖులు, స్పోర్ట్స్ స్టార్స్, బిజినెస్ మాగ్నెట్ కు అమ్మినట్లు సుధీర్ రెడ్డి బయటపెట్టడం దేశవ్యాప్తంగా పెద్ద సంచలనం సృష్టించింది.
ఇక ఈ అంజలి కొనుగోలు చేసిన 6 ఎకరాల భూమి తో సహా, పక్కన ఉన్న చెరువు, అలాగే మొత్తం 40 ఎకరాల భూమి నిర్మాణాలు చేపట్టడానికి పనికిరావన్న విషయం తెలియని సచిన్ టెండూల్కర్ భార్య అంజలి, ప్రముఖ తమిళ హీరోయిన్ నయనతార, టాలీవుడ్ సినీ నటి రమ్యకృష్ణ మరికొందరు సినీ స్టార్స్ ….ఇంకా బిజినెస్ మాగ్నెట్స్ కూడా కోటా రెడ్ది నుండి భూములు కొనుగోలు చేసి మోసపోయారు అని ఏకంగా అతని బావమరిది సుధీర్ రెడ్డి వ్యాఖ్యానించడం ఇక్కడ విశేషం. “అసలు ఈ 40ఎకరాల భూమి, చెరువు ఏఫ్ టీ ఏల్ కింద ఉంది.. ఇక్కడ నిర్మాణాలు చేపట్టడానికి అనుమతులు రావు” అన్నాడు సుధీర్ రెడ్డి.
ఇక సుధీర్ రెడ్డికి తన బావ గురించి చాలా లేట్ గా తెలిసిందట. కోటా రెడ్డి తన వ్యాపార పార్ట్నర్ సుబ్బా రెడ్దితో ముందుగా చేసుకున్న ఒప్పందాలను దాటవేసి సుబ్బారెడ్డిని మోసం చేసినట్లు ఆదిత్య హోమ్స్ సిగ్నేచర్ అథారిటీ అయిన సుధీర్ రెడ్డి గ్రహించాడాట. వెళ్లి “ఇదేంటి బావా..?” అని నిలదీస్తే కోటారెడ్డి మాత్రం నీకు చెప్పిన పని నువ్వు చేయి… మిగతాది నేను నడిపిస్తాను అని మాట్లాడినట్లు చెప్పుకొచ్చాడు.
“నేను ఈ అంశంపై అసలు విషయాలను తెలుసుకొని, పెట్టుబడి పెట్టినటువంటి పార్టనర్ ను ఇంత దారుణంగా మోసం చేయడాన్ని నేను జీర్ణించుకోలేకపోయాను. జరిగిన విషయాలను వంశీరామ్ బిల్డర్స్ అదినేత సుబ్బారెడ్డి గారికి తెలియజేశాను. అయితే ఈ విషయం పై మా బావ కోటారెడ్డి నా పై వ్యక్తిగతంగా కక్ష్య పెంచుకొని…..నీకు నిలువ నీడ లేకుండా చేస్తాను, నిన్ను జైలు పాలు చేస్తాను, మీ కుటుంబాన్ని రోడ్డున పడేస్తానని, చివరికి నువ్వు ఎలా బతికి ఉంటావో చూస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడు.” అని సుధీర్ రెడ్డి చెప్పుకొచ్చాడు.
“ఇదే క్రమంలో నా పై వంద కోట్ల డాకుమెంట్లు కాజేశానని అసత్య ప్రచారం చేసినటువంటి, మాబావ కోటా రెడ్డి బాగోతాన్ని ప్రజల ముందు ఉంచాలని నిర్ణయించుకున్నాను,” అన్నాడు సుధీర్ రెడ్డి.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?