WTC Final: క్రికెట్ చరిత్రలో మొట్టమొదటి టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్స్ కు భారతదేశం ఇంగ్లండ్ చేరుకున్న విషయం తెలిసిందే. ఈ నెల 18వ తేదీ నుండి న్యూజిలాండ్ తో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ జరుగుతుంది. ఈ టెస్ట్ మ్యాచ్ లో విజేతగా నిలిచిన జట్టు ప్రపంచ ఛాంపియన్ గా అవతరించనుంది. భారత్ నుండి ప్రత్యేక విమానంలో పురుషుల జట్టు, మహిళల జట్టు లండన్ చేరుకున్నాయి.
విమానయానంలో ఎలా గడిపారో… భారత్ నుండి లండన్ కు ప్రతిష్టాత్మక టెస్ట్ మ్యాచ్ కోసం ప్లేయర్లు ఎలా సన్నద్ధమై బయలుదేరారు అన్న వీడియోలను అధికారిక బిసిసిఐ తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేసింది. ఈ నేపథ్యంలో విమాన ప్రయాణ సమయంలో కొంతమంది తమ అనుభవాలను ప్రస్తావించారు.
ప్రస్తుతం బంతితో అద్భుతాలు సృష్టిస్తున్న హైదరాబాద్ యువ పేసర్ మహమ్మద్ సిరాజ్ తన విమాన ప్రయాణం గురించి చెపుతూ తాను ప్రశాంతంగా నిద్రపోతూ రెస్ట్ తీసుకుంటుంటే రోహిత్ శర్మ తన నిద్రకు భంగం కలిగించాడు అని తెలిపాడు.
ఎయిర్ పోర్టులో ల్యాండ్ అయిన తర్వాత హోటల్కు వెళ్ళేందుకు రెండు గంటల సమయం పడుతుందని… ఆ రెండు గంటలు మంచిగా నిద్రపో పోదాం అనుకుంటే రోహిత్ భాయ్ వచ్చి నిద్ర లేపాడని… ఆ తరువాత తనకు మళ్లీ నిద్ర రాలేదని చెప్పాడు. సరిగ్గా విమానం ల్యాండ్ అయిన రెండు గంటల ముందు మళ్ళీ కాస్త నిద్రపోయాను. నిన్న రన్నింగ్ లో కాస్త ఎక్కువగానే పాల్గొన్నారు కాబట్టి అలసిపోయాను. కానీ తనకు సరైన నిద్ర లేదని సిరాజ్ తన అనుభవాన్ని చెప్పాడు.