అమరావతి, మార్చి 29: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సిట్ యధావిధిగా దర్యాప్తు కొనసాగించుకోవచ్చని హైకోర్టు ధర్మాసనం పేర్కొన్నది.
వివేకా హత్య కేసును సిబిఐకి అప్పగించాలంటూ దాఖలైన మూడు పిటిషన్లపై హైకోర్టులో శుక్రవారం వాదనలు ముగిసాయి. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం కేసు విచారణ ఏప్రిల్ 15వ తేదీకి వాయిదా వేసింది.
అధికార, ప్రతిపక్ష నేతలు ఎవ్వరూ వివేకా హత్య కేసుపై మీడియాలో గానీ, బహిరంగ సభల్లోగానీ మాట్లాడవద్దని హైకోర్టు ఆదేశించింది. సిట్ విచారణ యధావిధిగా కొనసాగించుకోవచ్చని హైకోర్టు సూచించింది.