పక్కా ప్లాన్ చేసి భర్తను చంపేసి.. దాన్ని యాక్సిడెంట్ గా అందరిని నమ్మించిన కిలేడీ ఉదంతం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. హైదరాబాద్ మహానగర శివారులో చోటు చేసుకున్న ఈ ఘటన అందరినీ విస్తుపోయేలా చేసింది.ఒక మహిళా ప్రజా ప్రతినిధి ఇలా చేయటం అనేది ఇక్కడ విశేషం
మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో సురేష్.. బబిత భార్యభర్తలు. సైదోనిగడ్డ గ్రామ ఏడో వార్డు మెంబరు గా బబిత వ్యవహరిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఆమెకు దుండిగల్ తండా కు చెందిన ప్రేమ్ సింగ్ కు మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. అది కాస్తా స్థాయి మారింది. ప్రియుడి మోజు లో పడిన ఆమె.. తన ఆనందాలకు భర్త అడ్డు గా ఉన్నాడనే వరకూ వెళ్లింది.
ఎలా అయినా భర్తను వదిలించుకోవాలన్న ఉద్దేశం తో ప్రియుడు ప్రేమ్ సింగ్ తో కలిసి దారుణమైన ప్లాన్ వేసింది. బబిత భర్త భారత్ బయోటెక్ లో పని చేస్తుంటాడు. బబిత స్కెచ్ తెలీని అతగాడు ఆఫీసు నుంచి వస్తుండగా.. ముందు గా వేసుకున్న ప్లాన్ తో డీసీఎం తో ఢీ కొట్టారు. ప్రమాదమని అందరూ భావించేలా చేసి.. కారు లో తరలించే ప్రయత్నం లో గొంతు నొక్కి చంపేశారు.
అయితే.. ఈ ఉదంతంపై మృతుడి కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చింది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనుమానం వచ్చిన పోలీసులు అనుమానపు తీగను లాగటం షురూచేశారు. చివరకు డొంక కదిలి.. షాకింగ్ నిజాలు బయటకు వచ్చాయి. ఈ హత్య కేసులో బబిత.. ప్రియుడు ప్రేమ్ సింగ్ తో పాటు.. మరో ముగ్గురిని నిందితులుగా పోలీసులు గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకొని రిమాండ్ కు తరలించారు.మరో నలుగురు ఆనుమానితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.పరపురుషుడి వ్యామోహంలో పడి పచ్చటి కుటుంబాన్ని నాశనం చేసుకున్న బబిత ఇప్పుడు జైలుఊచలు లెక్కిస్తోంది.వివాహేతర సంబంధాలే ఇలాంటి నేరాలకు దారి తీస్తున్నాయని పోలీసు వర్గాలు చెబుతున్నాయి.