Bath Powder: ఈరోజుల్లో స్నానానికి ప్రతి ఒక్కరూ సబ్బును ఉపయోగిస్తున్నారు.. అదే మన బామ్మల కాలంలో అయితే ఎంచక్కా సున్నిపిండి పెట్టి రుద్ది స్నానం చేయించారు.. చిన్న పిల్లలకు నలుగు పెట్టి స్నానం చేయిస్తే చక్కటి రంగు వచ్చేవారు.. అదే పెద్దలు అయితే చర్మంపై ఉన్న మృత కణాలు అన్నీ పోయి కాంతివంతంగా చేస్తుంది. ప్రస్తుతం అందరూ సున్నిపిండిని ఉపయోగించడం మర్చిపోయారు. సబ్బు లో ఉండే హానికర రసాయనాలు వలన చర్మం పొడిబారి పోతుంది. అనేక రకాల చర్మ సంబంధ సమస్యలను తీసుకొస్తుంది.. ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఆయుర్వేద సున్నిపిండి తయారు చేసుకుని ఉపయోగిస్తే అన్ని రకాల చర్మ సమస్యలు పోయి చర్మం తెల్లని రంగు లోకి మారుతుంది.. ఆ సున్నిపిండి ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం..!!
Bath Powder: ఈ సున్నిపిండితో రుద్దుకుని ఉంటే మేనిఛాయ మెరుస్తుంది..!!
కావలసిన పదార్థాలు:
చందనం చూర్ణం 100 గ్రాములు, ఉసిరికాయ పొడి 100 గ్రాములు, తుంగ గడ్డల పొడి 100 గ్రాములు, మెంతుల పొడి 100 గ్రాములు, తులసి పొడి 100 గ్రాములు, వేపాకు పొడి 100 గ్రాములు, మారేడు ఆకు పొడి 100 గ్రాములు, పెసలు 800 గ్రాములు.
పైన చెప్పుకున్న వస్తువులన్నింటిని సేకరించి దంచి పొడి చేసుకోవాలి. ఈ పొడిని ఒక సీసాలో నిల్వ చేసుకోవాలి. ప్రతి రోజు స్నానం చేసే ముందు ఈ సున్నిపిండిని రాసుకొని నలుగు పెట్టుకుని కాసేపు ఆగిన తర్వాత స్నానం చేయాలి. శరీరం పై పేరుకుపోయిన మురికి మృతకణాలను తొలగిస్తుంది. చర్మం ప్రకాశవంతంగా మారుతుంది. ఇలా వరుసగా కొన్ని రోజులపాటు చేస్తూ ఉంటే మీ చర్మం రంగు తెల్లగా మారడం చూసి మీరే ఆశ్చర్యపోతారు. పైన చెప్పుకున్న పదార్ధాలు ఒకవేళ మీకు దొరకకపోతే శెనగపిండి, ఉలవ పిండి లో చందనం కలిపి రాసుకుని తల స్నానం చేసినా పైన చెప్పుకున్న ఫలితాలు కనిపిస్తాయి.
ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ స్నానానికి సబ్బు ఉపయోగిస్తున్నారు. అదే మన బామ్మల కాలంలో మాత్రం సున్నిపిండి తయారు చేసుకుని ఉపయోగించేవారు. సున్ని పిండి లో ఎటువంటి రసాయన పదార్థాలు ఉండవు. ఇవి చర్మాన్ని మృదువుగా చేసి కాంతివంతం అయ్యేలా చేస్తుంది. చర్మంపై పేరుకుపోయిన దుమ్ము , ధూళిని తొలగించి చర్మానికి సహజ రంగును సంతరించుకునేలా చేస్తుంది. ఉరుకుల పరుగుల జీవితంలో కనీసం వారంలో రెండు సార్లయినా సున్నిపిండితో స్నానం చేయడం అలవాటు చేసుకోండి.