Skipping breakfast: మన లో ఎక్కువ మంది రకరకాల కారణాలతో ఉదయం వేళ టిఫిన్ తినకుండా,ఏకంగా మధ్యాహ్నం భోజనం చేసేస్తుంటారు. కొంత మంది మాత్రం టీలేదా కాఫీ తాగి సరిపెట్టేసుకుంటారు. ఇలా చేయడం అనేది ఆరోగ్యానికి అసలు ఏమాత్రం మంచిది కాదంటున్నారు డాక్టర్లు. ఎందుకంటే, రాత్రి భోజనంతర్వాత ఇంచుమించుగా 8 నుంచీ 10 గంటల వరకూ ఏమీ తీసుకోము.
అలాంటప్పుడు ఉదయం వేళ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయడం వల్ల తలనొప్పి, టెన్షన్, వణుకు, నీరసం గ్యాస్, ACDT వంటి సమస్యలు రావడమే కాదు చాలా సమస్యలు వస్తాయి. అందుకేమన పెద్దవాళ్ళు ఒక మాట చెప్పారు.. ఉదయం వేళ రాజులా తినాలి, మధ్యాహ్నం మంత్రిలా, రాత్రి బంటులా తినాలని. కాబట్టి ఉదయం వేళ తినే ఆహారం సరైనది తింటే శక్తి వచ్చి రోజంతా ఉత్సహం గా పని చేయగలరు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. సరైన ఆహారం తినేవారు మంచి ఆరోగ్యం తో, దీర్ఘకాలం కాలం జీవిస్తారని పరిశోధనలుతెలుపుతున్నాయి.
ప్రపంచం లో బ్లూజోన్స్గా పిలుస్తున్న ప్రదేశాల్లో ప్రజలు వందేళ్లకు పైగా జీవించి ఉంటున్నారు. అంతవరకూ ఎందుకు మన తాతలు,ముత్తాతలు పొద్దు పొద్దున్నే సద్దిఅన్నం తిని దీర్ఘాయుష్మంతులుగా బ్రతికిన సంగతి మనందరికీ తెలిసిందే. మన దేశంలో కేరళ, జమ్మూకాశ్మీర్, పంజాబ్, మహారాష్ట్రలో ప్రజలు తప్పనిసరిగా బ్రేక్ఫాస్ట్ తీసుకుంటున్నారు. అందువల్ల సగటు కంటే ఎక్కువ కాలం జీవిస్తున్నారు. కేరళ లో ఇడ్లీ లేదా అప్పం… కాశ్మీర్లో బ్రెడ్ లేదా నూన్ చాయ్… పంజాబ్లో పరాఠా… మహారాష్ట్రలో ప్రజలు పోహా ఎక్కువగా తీసుకుంటున్నారు.
అందువల్ల వారంతా ఎక్కువ కాలం జీవిస్తున్నాట్టుగా తెలుస్తుంది. అందువల్ల ఈ టిఫిన్లను ఆరోగ్యకరమైన అల్పాహారం గా చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ఐతే… వీటిని ఇళ్ల లో చేసుకొని తినడం మంచిది. బయటి హోటళ్లలో కొనుక్కుంటే… అక్కడ మైదాపిండి, పామాయిల్ వాడే ప్రమాదంఉంది. ఈ రెండింటి తో తయారుచేసే టిఫిన్లు ఎంత ఎక్కువగా తింటే అంత ఎక్కువగా ఆరోగ్యం దెబ్బతింటుంది. కనీసం అరటి పండ్లు కప్పు పాలు, డ్రై ఫ్రూట్స్ కలిపి తినమని తెలియచేస్తున్నారు. కాబట్టి… ఎట్టిపరిస్థితుల్లో బ్రేక్ఫాస్ట్ తినడం మాత్రం మానొద్దు. వీలైనంతవరకూ ఆయిల్ లేని ఫుడ్ టైమ్ ప్రకారం, సరిపడా తీసుకుంటూ ఉంటే… మంచిఆరోగ్యం పొందవచ్చు.