SLEEPING: ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవనంలో ప్రతీ పని స్పీడ్గానే జరిగిపోవాలని ప్రతీ ఒక్కరు భావిస్తుండటం మనం చూడొచ్చు. ఈ క్రమంలోనే మనుషుల జీవనశైలి పూర్తిగా మారిపోయింది. తినే తిండి కూడా ఒంటికి పట్టలేని పరిస్థితులు నెలకొని ఉన్నాయి. కాగా, ఈ బిజీ లైఫ్కు కొవిడ్ కొంత కాలం బ్రేక్ ఇవ్వగా, ప్రజెంట్ మళ్లీ మునుపటి పరిస్థితులే ఉన్నాయి.
అయితే, ఈ కరోనా మహమ్మారి వల్ల చాలా మంది జనాలు ఉద్యోగాలు కోల్పోగా, మానసికంగా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఏదో ఒక చిన్న పని అయినా చేసుకుంటూ తమ జీవితాన్ని నెట్టుకుంటూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వారిపై విపరీతమైన మెంటల్ ప్రెషర్ పడుతోంది. ఫలితంగా నిద్ర కరువవుతోంది. ప్రతీ ఒక్కరికి నిద్ర అతిముఖ్యమని నిపుణులు సూచిస్తున్నప్పటికీ నిద్రపోవడం లేదు. స్మార్ట్ ఫోన్ పుణ్యమాని దాన్ని చూసుకుంటే కాలం వెల్లదీస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ చిట్కాలు పాటిస్తే ఇట్టే నిద్రపోవచ్చట.
అవేంటంటే.. నిద్రించడం ఆరోగ్యానికి అతి ముఖ్యమట. హెల్దీ పర్సన్స్ కచ్చితంగా ప్రతీ రోజు తొమ్మిది గంటలు పడుకుంటే మంచిదని పెద్దలు చెప్తున్నారు. యవ్వనంగా ఉండటంతో పాటు స్కిన్ అట్రాక్టివ్నెస్ కోసం స్లీప్ అనేది కంపల్సరీ. ప్రతి ఒక్కరూ కనీసం ఎనిమిది గంటలైనా పడుకోవాలని చెప్తున్నారు నిపుణులు. ఇకపోతే నిద్రించే ముందర ముఖాన్ని శుభ్రంగా కడుక్కుని పడుకోవడం మంచిదట. అలా చేస్తే త్వరగా నిద్రపట్టే చాన్సెస్ ఉంటాయి. ఇకపోతే పొద్దటి నుంచి మొదలుకుని పడుకునే వారి ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్ యూజ్ చేస్తున్నారు. ఫలితంగా బ్లూ స్క్రీన్ కళ్లపై పడి నిద్ర రాదు. ఈ నేపథ్యంలో అన్నం తినే సమయంతో పాటు పడుకోవడానికి రెండు లేదా మూడు గంటల ముందుకు ఫోన్ యూజ్ చేయకపోవడమే చాలా మంచిదని హెల్త్ ఎక్స్పర్ట్స్ సూచిస్తున్నారు. నిద్రకు ఉపక్రమించే ముందర అరగంట ముందరే ఫుడ్ తీసుకుని ఆ తర్వాత నిద్రిస్తే మంచి ప్రయోజనం ఉంటుందట.