జగన్ ప్రభుత్వం నేడు ప్రవేశ పెట్టిన వార్షిక రాష్ట్ర బడ్జెట్ లో ముఖ్యంగా సంక్షేమ పథకాలు మరియు ఉన్నత స్థాయి రంగాల పైనే ఫోకస్ చేస్తారని భావిస్తే చివరికి అతను ప్రవేశ పెట్టిన బడ్జెట్ సమతూకంగా ఉందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడ్డారు.
మొత్తం మీద జగన్ ప్రభుత్వం ఉన్న రెండు లక్షలా అరవై కోట్లలో అభివృద్ధి పథకాలకే 84,140 కోట్లు ఖర్చు చేయనుండడం విశేషం. వాటిల్లో అంత విశేషత సంచరించుకోని కొద్ది రంగాలు అతి ప్రముఖమైనవి చాలా ఉన్నాయి. వాటికి ఎంత కేటాయించారో ఒక లుక్కేదామా…?
- ఫిషింగ్ హార్బర్ కు 142 కోట్లు
- రియల్ టైమ్ గవర్నెన్స్ కు 54.41 కోట్లు
- పశుగానాభివృద్ధి, మత్స్యకారుల కు 1279.78 కోట్లు
- ట్రాన్స్పోర్టు, అర్ & బీ కి 6,588 కోట్లు
- సోషల్ వెల్ఫేర్ కు 12,465 కోట్లు
- డ్వాక్రా కి 975కోట్లు
- రేషన్ బియానికి 300 కోట్లు
- పీఎం కిసాన్ యోజన కు 3,615 కోట్లు
- ధరల స్థిరీకరణ నిధి కి 3,000 కోట్లు
- పీఎం ఆవాస్ యోజన – అర్బన్ – 2540 కోట్లు
- పీఎం ఆవాస్ యోజన – గ్రామీణ – 500 కోట్లు
- మహిళా శిశు దివ్యాంగులు వయోవృద్ధులు 3456.02 కోట్లు
- పర్యాటక రంగానికి 273.66 కోట్లు
ఈ సమయంలో బుగ్గన మాట్లాడుతూ 2018-19 లో స్థూల ఉత్పత్తి 8% పెరిగిందని మరియు
గత ప్రభుత్వం మిగిల్చిన అప్పులు సునామీలా వచ్చి పడుతున్నాయని అన్నారు.