Prawns :నాన్ వెజ్ తినే వారిలో ఎక్కువ మంది రొయ్యలు బాగా ఇష్టపడుతుంటారు.ఈ రొయ్యలతో అనేక రకాల వంటలు చేసుకోవచ్చు.వాటి తో స్నాక్స్ చేసుకోవాలంటే మాత్రం పకోడీ వేసుకుంటే అద్భుతమైన రుచి అనుభవానికి వస్తుంది అని చెప్పడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు..అది ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం.
రొయ్యలు – అరకేజీ,
శనగపిండి – 5 టీస్పూన్లు (మీరు తీసుకున్న రొయ్యల సైజు బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు)
అల్లం వెల్లుల్లి పేస్ట్ – 3 టీ స్పూను,
1 పెద్ద ఉల్లిపాయ- తరిగి పెట్టుకోవాలి
నూనె – ఫ్రై కి సరిపడా
వంట సోడా – చిటికెడు,
ఉప్పు – రుచికి తగినంత,
కారం – 4 స్పూన్స్,
గరం మసాలా – 1 టీ స్పూను,
పచ్చిమిర్చి – 4,
కొత్తిమీర తరుగు – 2 టేబుల్స్పూను
కరివేపాకు – గుప్పెడు,
మీరు తినే రుచిని బట్టి పైన వాటిని తగ్గించుకోవచ్చు లేదా పెంచుకోవచ్చు. ముందుగా రొయ్యలు బాగా శుభ్రం చేసి పెట్టుకోవాలి..లేదంటే దాని నుండి వచ్చే వాసన వండిన కూడా పోదు కాబట్టి క్లీనింగ్ విషయంలో కొంచెం ఎక్కువ శ్రద్ధ పెట్టాలి ఉంటుంది. తర్వాత ఒక పాత్రలో రొయ్యలు,పచ్చిమిర్చి, ఉల్లి,,కరివేపాకు, కొత్తిమీర తరుగు, గరం మసాలా వంట సోడా, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు, కారం, శనగపిండి వేసి అవసరమైతే నే కొంచెం నీరు చల్లుకుని బాగా కలిపి అరగంట నుంచి గంట పాటు నానబెట్టుకోవాలి .
ఆ తర్వాత స్టవ్ మీద నూనె పెట్టుకుని వేడెక్కాక స్టవ్ మీడియం నుండి సిమ్ కి అడ్జస్ట్ చేసుకుని నూనెలో పకోడీల్లా వేస్తూ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అంతే ఎంతోరుచిగా ఉండే రొయ్యల పకోడీసిద్ధంగా ఉంటుంది. రొయ్యల్లో పోషకాలు పుష్కలం గా ఉంటాయి. బరువు తగ్గాలనుకునేవారు రొయ్యలు తినడం వలన మంచి ఫలితం ఉంటుంది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?