కోయంబత్తూరు: తమిళనాడులోని ఒక ఏటిఎంలో అనుకోని అతిథి వినియోగదారులను భయపెట్టింది. నాలుగు అడుగుల త్రాచు పాము కోయంబత్తూరులోని థనీర్పండల్ రోడ్లోని ఐడిబిఐ బ్యాంక్ ఎటిఎం గదిలోకి ప్రవేశించింది.
డబ్బులు డ్రా చేసేందుకు వచ్చిన ఒక వినియోగదారుడు పాము ఉండటాన్ని గమనించి బయటకు పరుగు తీశాడు. సెక్యూరిటీ సిబ్బంది ఈ విషయాన్ని బ్యాంక్ అధికారుల దృష్టికి తీసుకు వెళ్లగా వారు పాములు పట్టే వ్యక్తికి సమాచారం అందించారు.
హుక్ హ్యాండిల్ను ఉపయోగించి ఆ వ్యక్తి పామును సురక్షితంగా తరలించటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
నిన్న, మూడవ విడత పోలింగ్లో భాగంగా కేరళ రాష్ట్రం కన్నూర్ నియోజకవర్గంలోని ఒక పోలింగ్ బూత్లో పాము హల్చల్ చేసింది. వివి ప్యాట్లో పాము దర్శనమివ్వడంతో ఎన్నికల అధికారులు, ఓటర్లు భయాందోళనకు గురయ్యారు. పామును వెంటనే బయటకు రప్పించటంతో పోలింగ్ ప్రశాంతంగా జరిగింది.
(వీడియో ఏఎన్ఐ సౌజన్యంతో)
#WATCH Tamil Nadu: A Snake found inside an ATM near Thaneerpandal Road in Coimbatore; later rescued by a snake catcher. ( 23.04.2019) pic.twitter.com/Yk6YSOIQVn
— ANI (@ANI) April 24, 2019