ఈ రోజుల్లో ప్రేమించుకునే జంటలకు కొదవేలేదు.. అయితే ఆ ప్రేమను ఎంతవరకు మంది పెళ్లి దాకా తీసుకెళ్తున్నారు.. చివరికి పెళ్లి చేసుకుంటున్నారా లేదా అనే సందేహాలు కూడా చాలానే ఉన్నాయి..ప్రేమ పెళ్లి చేసుకోవాలంటే పెద్దలనే కాకుండా పోలీసులను కూడా ఎదిరించిన.. ఓ యువతి తన ప్రేమించిన ప్రియుడిని పెళ్లి చేసుకోవడం కోసం ఎన్ని ట్విస్టుల ఇచ్చిందో చూడండి..
మహబూబాబాద్ జిల్లా కురవి మండలం కంపెల్లికి చెందిన ఎర్రగుంట దివ్య. శుక్రవారం జిల్లా కేంద్రంలోని దేవాలయం సమీపంలో తన ప్రియుడి తో వివాహం చేసుకుంది. ఈనెల 24 గురువారం మరిపెడ మండలం లోని ఓ కళ్యాణ మండపము నందు తనకు ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారని వధువు 100 కి ఫోన్ చేసి పెళ్లి ఆపివేయమంటూ వారిని వేడుకుంది. వెంటనే స్పందించిన పోలీసులు పెళ్లి మండపం కు చేరుకొని ఆ పెళ్లిని నిలిపివేశారు.. ఆ వరుడి తల్లిదండ్రులు ఈ విషయాన్ని అవమానంగా భావించడం తో అదే పెళ్లికి హాజరైన బంధువుల అమ్మాయితో అదే ముహూర్తానికి పెళ్లి చేశారు.. అయితే దివ్య తాను ప్రేమించిన యువకుడు కాంపెల్లి గ్రామానికి చెందిన కొల్లు నరేష్ ను మానుకోట శివారులోని శుక్రవారం రోజున గుడిలో వివాహం చేసుకుంది..