హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్కు వివాహ వేడుకలకు వెళ్లేందుకు సమయం ఉంటుంది కానీ దిశ కుటుంబ సభ్యులను పరామర్శించడానికి సమయం ఉండదా అని సామాజిక కార్యకర్త తృప్తి దేశాయ్ ప్రశ్నించారు. దీనిపై ముఖ్యమంత్రిని నిలదీస్తానని ప్రకటించిన తృప్తిదేశాయ్ ప్రగతి భవన్ వద్దకు బయలుదేరడంతో మార్గమధ్యలోనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా స్వల్ప ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. దిశా ఘటనలో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని తృప్తిదేశాయ్ డిమాండ్ చేశారు.
previous post
next post