బీజేపీ నుండి సస్పెండ్ అయిన ఎమ్మెల్యే రాజాసింగ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన పాత బస్తీకి చెందిన యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. సోషల్ మీడియా ద్వారా మత విధ్వేషాలు రెచ్చగొడుతున్నారన్న అభియోగంపై కష్యఫ్ పై పీడీ యాక్ట్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. కష్యఫ్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు ముందుగా వైద్య పరీక్షల పరీక్షల నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షల అనంతరం కోర్టులో హజరుపర్చగా మెజిస్ట్రేట్ రిమాండ్ విధించడంతో చంచల్ గూడకు జైలుకు తరలించారు. కష్యఫ్ ఇటీవల హైదరాబాద్ సీపీ కార్యాలయం ముందు ధర్నా చేశారు.
గోషామహాల్ ఎమ్మెల్యే రాజా సింగ్ ను ఉద్దేశించి కష్యఫ్ చేసిన సర్ తాన్ సే జూడ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కష్యఫ్ వివాదాస్పద వ్యాఖ్యలతో రెచ్చిపోయిన యువకులు మొగల్ఫూర, భవానీనగర్, హుస్సేనీఅలం, షహనద్గంజ్ పోలీస్ స్టేషన్ల పరిధిలో పోలీసులపై రాళ్లు రువ్వి, పోలీసు వాహనాలను ధ్వంసం చేశారు. ఒక క్యాబ్ డ్రైవర్ తో పాటు హోటల్ సిబ్బందిపై దాడికి పాల్పడ్డారు. ఈ ఈ ఆందోళనలకు భయపడి పలు చోట్ల దుకాణాలను మూసివేశారు. పదేపదే సోషల్ మీడియాలో వివాదాస్పద వీడియోలు పోస్టు చేస్తున్న కష్యఫ్ పై పోలీసులు నాలుగు కేసులు నమోదు చేశారు. నేడు పీడీ యాక్ట్ కింద అరెస్టు చేసి చంచల్ గుడ జైలుకు తరలించారు.