బిగ్ బాస్ గ్రాండ్ ఫైనల్ లో సయ్యద్ సోహెల్ రన్నరప్ గా నిలుస్తాడని అంతా ఊహించారు. అయితే అదే జరిగి ఉంటే అతనికి ఏమీ మిగిలేది కాదు. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ సోహెల్ అనూహ్యమైన నిర్ణయం తీసుకున్నాడు. విన్నర్, రన్నర్ స్థానాన్ని వదిలేసి 25 లక్షల సూట్ కేసు తీసుకోవడంతో అందరూ షాక్ తిన్నారు. ఇక అలా తను ఎందుకు తీసుకున్నాడో ఎవరికీ అర్థం కాలేదు. దీనిపైన సోహెల్ వివరణ ఇచ్చాడు.
ఇంటిలోకి ప్రవేశించిన సమయంలోనే నేను బలహీనమైన కంటెస్టెంట్ అనుకున్నాను. కరాటే కళ్యాణి, లాస్య, అభిజిత్, రాజశేఖర్ వంటి వారికి ముందే పాపులారిటీ ఉంది. వారితో పోలిస్తే నేను బలహీనమైన వ్యక్తి అని అనుకున్నాను. కానీ ఒక్కొక్కరు బయటకు వెళ్తుంటే నామీద నాకు ఆత్మవిశ్వాసం వచ్చింది. అయితే పదవ వారంలో మెహబూబ్ ఎలిమినేట్ కావడం నాకు బాధ కలిగించింది అసలు ఫైనల్స్ కు రావలసిన కంటెస్టెంట్ దురదృష్టవశాత్తు ఎలిమినేట్ కావడం అర్థం కాలేదు
పదేళ్లక్రితం సినిమాలో నటించడానికి హైదరాబాద్ చేరుకున్నాను పదేళ్ల కష్టపడితే దానికి 15 రోజుల్లో బ్రహ్మాండమైన ఫలితం మంచి గుర్తింపు లభించింది. ఇక ఆ తర్వాత క 25 లక్షల రూపాయల ఆఫర్ రాగానే బాగా ఆలోచించాను. నా సోదరుడు, తండ్రి కూడా సరే అనడంతో ఆలోచనలో పడ్డాను అన్నాడు సోహెల్. ఆ డబ్బులు తీసుకొని 10 లక్షలు అనాథ శరణాలయానికి ఇవ్వాలని అనుకున్నట్లు సోహెల్ అన్నాడు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?