కరోనా ప్రపంచదేశాలు అన్నిటినీ గజ గజలాడించింది. ఈ మహమ్మారి ఆర్ధికంగా, ఆరోగ్యపరంగా దేశాలన్నిటినీ కృంగతీసేసిన విషయం తెలిసిందే. కరోనా 2019 నవంబర్ లో మొదటి కేసు నమోదు కాగా, ఆ తరువాత డిసెంబర్ చివరలో చైనాలోని వుహాన్ యొక్క హుబీ ప్రావిన్స్లో ఈ మహమ్మారి తీవ్ర స్థాయిలో వ్యాప్తి మొదలయింది. అది మొదలు నేటి వరకు ఈ మహమ్మారి కి అడ్డుకట్ట పడలేదు. అయితే వైరస్ మొదలయ్యి ఏడాది పూర్తియినప్పటికీ, దీని పుట్టుకకు గల కారణాలు తెలుసుకోవడం కోసం శాస్త్రవేత్తలు అధ్యయనాలు చేస్తూనే ఉన్నారు. చైనా లో పురుడు పోసుకున్న ఈ మహమ్మారి వ్యాప్తికి సంబంధించిన సాక్ష్యాలను చైనా ఉద్దేశపూర్వకంగానే నాశనం చేసింది అని, గతంలో చాలా నివేదికలు రుజువు చేశాయి. తాజాగా చైనా ఆరోగ్య సంస్థ కు సంబంధించి కొన్ని అంతర్గత పత్రాలు బయటపడడం తో పాత అనుమానాలకు కొత్త అర్ధాలు మొదలయ్యాయి.
చైనా ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలో పనిచేసిన ఒక వ్యక్తి, హుబీ ప్రావిన్షియల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సిడిసి) కు సంబందించిన 117 పేజీల అంతర్గత పత్రాలను, అంతర్జాతీయ మీడియా సంస్థ అయినా సిఎన్ఎన్కు అందించాడు. ఈ పత్రాలను ఆరుగురు నిపుణులచే పరిక్షిణించబడిన తరువాత, సిఎన్ఎన్ ధ్రువీకరించింది. నవంబర్ 2019 నుండి ఏప్రిల్ 2020 మధ్య కరోనా వైరస్ కు సంబందించిన విషయాలను పటిష్టం గా ఉంచాడనికి, అలాగే వైరస్ ను ఎదుర్కోవడానికి చైనా ఏ విధంగా కష్టపడిందో ఈ పత్రాలు తెలియపర్చాయి అని ఈ మీడియా సంస్థ వెల్లడించింది.
వైరస్ పుట్టుకు గురించి అనేక అనుమానాలు ఉన్నాయి. ముందుగా చైనాలోని ల్యాబ్ లో వైరస్ లీక్ అవ్వడం ద్వారా కోవిద్-19 వ్యాప్తి చెందిది అని అనుమానించిన, వుహాన్ లోని తడి మార్కెట్ ద్వారా వ్యాప్తి మొదలైంది అని చైనా లోని శాస్త్రవేత్తలు తెలిపారు. అయితే వైరస్ మూలానికి సరియైన కారణం ఇంకా తెలియలేదు. మార్కెట్లో సాధారణ ఇన్ఫెక్షన్ మూలాన్ని బహిర్గతం చేయడం ద్వారా రోగులు అనారోగ్యానికి గురయ్యారని స్థానిక ఆరోగ్య అధికారులు మొదట్లో భావించి, జనవరి 20 వరకు వ్యాధికారక అంటువ్యాధి అని తోసిపుచ్చారు. దీనితో కరోనా వ్యాప్తి ప్రపంచ దేశాలు అన్నిటిని చుట్టేసింది. ప్రారంభ దశలో ప్రాణాంతక వైరస్ ను తప్పుగా అంచనా వేయడం. వైరస్ గురించి వైద్యులు ఏమి మాట్లాడకూడదు అని చైనా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం వంటి కారణం వల్లే ఇతర దేశాలు సైతం ప్రమాదంలో పడిపోయాయి. ఇదే కాకుండా బీజింగ్ ప్రయోగశాలలలో వైరస్ కు సంబందించిన సాక్ష్యాలను నాశనం చేసింది, టీకాపై పనిచేస్తున్న అంతర్జాతీయ శాస్త్రవేత్తలకు ప్రత్యక్ష నమూనాలను అందించడానికి కూడా నిరాకరించింది చైనా.
మరోపక్క వైరస్ కు సంబంధించిన సమాచారాన్ని చైనా ఉద్దేశపూర్వకంగానే దాచిపెట్టినట్లు యునైటెడ్ స్టేట్స్ మరియు ఇతర పాశ్చాత్య ప్రభుత్వాలు ఆరోపణులు చేసాయి. ఈ ఆరోపణలను చైనా ప్రభుత్వం తీరస్కరించింది.