ఎప్పటినుండో అనుకుంటున్నదే…. ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు పదవి నుండి కన్నా లక్ష్మీనారాయణను హైకమాండ్ తొలగించింది. అతని స్థానంలో ఏపీ బీజేపీ చీఫ్ గా సోము వీర్రాజు ను నియమిస్తున్నట్లు బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రకటించారు.
లక్ష్మీనారాయణ నాయకత్వంలో అసలు ఆంధ్ర ప్రదేశ్ లో బిజెపి క్యాడర్ ఉందా లేదా అన్న సందేహం ఏపీ ప్రజలకు కలిగింది. అంతే కాకుండా ఆయన పార్టీని బలోపేతం చేయడంలో ఘోరంగా విఫలమయ్యారని విమర్శలు బాగా వినిపించాయి. ఈ పరిస్థితుల మధ్య కన్నా తొలగింపు లాంఛనమే అని కొద్ది నెలల ముందే ఫిక్స్ అయిపోయింది.
ఇక సోము వీర్రాజు నాయకత్వంలో జనసేన పార్టీ అండతో ఏపీ బీజేపీ కొత్త పుంతలు తొక్కుతోంది అని అటు హైకమాండ్ తోన్ పాటు లోకల్ పార్టీ వర్గాలు కూడా ఆశిస్తున్నాయి. మరి వీర్రాజు బిజెపిలో ఆ మార్పుని తీసుకురాగలడో…. లేదో చూడాలి.