ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మూడు రాజధానుల విషయంలో ఎంత పట్టుదలగా ఉన్నాడో చూస్తూనే ఉన్నాం. చాలా నెలల కిందట అసెంబ్లీలో ప్రవేశపెట్టిన రాజకీయ వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దుబిల్లుల పై వైసిపి ఇప్పటివరకు పట్టు సడలించలేదు. హైకోర్టు నుంచి ఎన్ని ఎదురు దెబ్బలు తగులుతున్నా ఓపికగా వేచి ఉన్నారు. విశాఖ మీద జగన్ కు ఉన్న ఇష్టం అలాంటిది.
అయితే జగన్ తో పోల్చుకుంటే మరొక నేతకు విశాఖ మీద అతనికి మించిన ఇష్టం ఉందని రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తుంది. అతనే బిజెపి కొత్త ప్రెసిడెంట్ సోము వీర్రాజు. పార్టీ పగ్గాలు చేపట్టిన వెంటనే చంద్రబాబు పై తీవ్రస్థాయిలో విరుచుకుపడిన సోము ఇప్పుడు బీజేపీని రాష్ట్రంలో ఒక బలమైన శక్తిగా నిలబెట్టేందుకు తనవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఈ బీజేపీ కొత్త అధ్యక్షుడు ఈ మధ్య ఎక్కువగా వైజాగ్ లో కనిపించడం గమనార్హం. అతని రోజువారీ కార్యక్రమాలు కూడా అక్కడి నుండే మొదలవుతున్నాయి.
పార్టీ తరపు అనౌన్స్మెంట్ లు అన్ని వైజాగ్ నుండి చేయడం గమనార్హం. ఇక వైజాగ్ జిల్లా కి పక్కనే పశ్చిమగోదావరి అనుకుని ఉండటం అతనికి సానుకూలాంశం. ఇక బిజెపి కార్యకర్తలు కూడా సోము వీర్రాజు వైజాగ్ లో ఎక్కువ కనిపించడం చూసి బాగా సంతోషిస్తున్నారు. అలాగే బిజెపికి వైజాగ్ నగరం పైన కొంచెం పట్టు ఉంది. దీంతో అటు పార్టీని, ఇటు ప్రజలను ఇద్దరినీ సమానంగా కవర్ చేస్తున్నారు.
బిజెపి కి విశాఖ నగరంలో కార్పొరేషన్ తో ఘన చరిత్ర ఉండడంతో పాటు మేయర్ సీట్లో కూడా వారి అభ్యర్థి కూర్చుని ఉన్నాడు. ఇక హరిబాబు 2019 వరకు విశాఖ ఎంపీగా ఉన్నారు. సోము వీర్రాజు మెంటల్ గా ఇక విశాఖ రాజధాని ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఉత్తరాంధ్రలోనే బీజేపీ పాగా వేయడం…. అక్కడే ఎక్కువ సంఖ్యలో ఉండే కాపు సామాజిక వర్గానికి అనుకూలంగా ఈమధ్య వారు చేసిన వ్యాఖ్యలు చేసి జగన్ కన్నా వీర్రాజు విశాఖపై ప్రేమ ఎక్కువ ఉంది అని తెలుస్తోంది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?