ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఇటీవల ఓ ప్రముఖ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో అనేక విషయాల గురించి మాట్లాడారు. తిరుపతి ఉప ఎన్నికల గురించి మాట్లాడుతూ బీజేపీ జనసేన పార్టీలు కలిసి పనిచేస్తాయి అని చెప్పుకొచ్చారు. ఇరు పార్టీల నిర్ణయంతోనే ఉమ్మడి అభ్యర్థి తిరుపతి ఉప ఎన్నికల్లో పోటీ చేస్తారని స్పష్టం చేశారు.
అంతమాత్రమే కాకుండా రాష్ట్రంలో అధికారంలోకి రావటమే ద్యేయంగా బీజేపీ-జనసేన భవిష్యత్తు రాజకీయాలు ఉంటాయని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు అదేవిధంగా కేంద్ర ఎన్నికల కమిషనర్ సునీల్ అరోరా జమిలి ఎన్నికల విషయంలో చేసిన కామెంట్లను టీవీ యాంకర్ ప్రస్తావించగా. దానికి సోము వీర్రాజు బదులిస్తూ కేంద్రం ప్రజాధనం దుర్వినియోగం కాకుండా ఒకే దేశం ఒకే ఎన్నిక, ఒకటే చట్టం, ఒకటే పన్ను అనేవి భారతదేశంలో ప్రజలలో చర్చ జరగాలి అనేది భారతీయ జనతా పార్టీ వైఖరి అని చెప్పుకొచ్చారు.
ఇదిలావుండగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని విషయంలో కేంద్రం రాష్ట్రప్రభుత్వం నిర్ణయమే ఫైనల్ నిర్ణయమని చెప్పటం గతంలో మనకందరికీ తెలిసిందే. జగన్ మూడు రాజధానులు నిర్ణయానికి కేంద్రం కూడా అప్పట్లో అడ్డుకోలేదు. ఇటువంటి తరుణంలో టీవీ యాంకర్ ఏపీ రాజధాని గురించి క్లారిటీ ఇవ్వాలని సోము వీర్రాజు ప్రశ్నించగా, మారు మాట్లాడకుండా ఏపీకి అమరావతి రాజధాని అని క్లారిటీ ఇచ్చారు. ఇందులో రెండో మాట లేదు అంటూ సోము వీర్రాజు చెప్పుకొచ్చారు. కేంద్రం కూడా అమరావతి నే రాజధానిగా గుర్తించినట్లు తాజా ఇంటర్వ్యూలో చెప్పటం గమనార్హం. ఏపీలో ఎటువంటి రాజీ లేకుండా ప్రజా సమస్యల విషయంలో బీజేపీ జనసేన కలిసి పోరాటం చేస్తాయని సోము వీర్రాజు ఏపీ రాజకీయాల గురించి చెప్పుకొచ్చారు.