ఇటీవల అమరావతి రాజధాని రైతులు తలపెట్టిన ఉద్యమం ఏడాది అయిన నేపథ్యంలో చంద్రబాబు తీవ్ర స్థాయిలో ప్రభుత్వ తీరు పై మండిపడిన సంగతి తెలిసిందే. జగన్ 18 నెలలు అధికారంలో రాష్ట్రానికి ఏం చేశాడని అంటూ తీవ్ర స్థాయిలో పరుష పదజాలంతో ఎన్నడు వాడని భాషతో బాబు సీరియస్ వ్యాఖ్యలు చేయడం జరిగింది.
అయితే బాబు చేసిన వ్యాఖ్యలకు భారీ స్థాయిలోనే వైసీపీ పార్టీకి చెందిన నాయకులు కొడాలి నాని అదేవిధంగా మంత్రి పేర్ని నాని కౌంటర్లు ఇవ్వటం జరిగింది. పరిస్థితి ఇలా ఉండగా తాజాగా అమరావతి విషయం గురించి చంద్రబాబుపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు కీలక వ్యాఖ్యలు చేశారు. రాజధాని అమరావతి లోనే ఉండాలని కానీ హైకోర్టు కర్నూలులో ఏర్పాటు చేయాలని కోరారు.
రాజధాని రైతులను చంద్రబాబు టిడిపి హయాంలో మోసం చేశారని, మళ్లీ ఇప్పుడు రాజధాని రైతుల గురించి ఆయన మాట్లాడటం విడ్డూరంగా ఉందని తెలిపారు. అదే కాకుండా రాయలసీమ జిల్లాలో ప్రాజెక్టులన్నీ కంప్లీట్ చేయటమే బీజేపీ ఆలోచన అని చెప్పుకొచ్చారు. అమరావతి రాజధానిగా గుర్తించడం జరిగింది కాబట్టే ఆ ప్రాంతం చుట్టుప్రక్కల కేంద్రం యొక్క అభివృద్ధి ఉందని తెలిపారు. ఏది ఏమైనా అమరావతి విషయంలో చంద్రబాబు పొలిటికల్ డ్రామాలు ఆడుతున్నటుగా సోము వీర్రాజు తాజాగా వ్యాఖ్యలు చేయడం జరిగింది.