ప్రస్తుతం ఏపీ సీఎం వైఎస్ జగన్ ను ఏపీ ప్రజలు బాగానే మెచ్చుకుంటున్నారు. ఏపీ ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నా కూడా ఆయన సరికొత్త సంక్షేమ పథకాలను ప్రారంభిస్తూ ప్రజల మనసును గెలుచుకుంటున్నారు. గతంలో పాలించిన టీడీపీ సరైన పథకాలను ప్రారంభించి.. ప్రజల్లోకి చేరువకాలేకపోయింది. కానీ.. జగన్ ఈ విషయంలో సక్సెస్ అయ్యారు.
అందుకే ప్రస్తుతం ఏపీ ఏరంగంలోనైనా ముందంజలో ఉంది. దేశంలోని పెద్ద పెద్ద రాష్ట్రాల కన్నా.. ఏపీ మెరుగ్గా ఉంది. కాకపోతే అప్పు మాత్రం కాస్త ఎక్కువగా ఉంది.
మరోవైపు ఏపీలో బీజేపీ కూడా తన కార్యచరణను పెంచుతోంది. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు అయ్యాక ఏపీ బీజేపీలో పలు మార్పులు చోటు చేసుకున్నాయి. అంతే కాదు.. వీర్రాజు కూడా కాస్త దూకుడుగానే వ్యవహరిస్తున్నారు. ఏపీ పరిస్థితిపై ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. ప్రజల సమస్యలను ప్రభుత్వం వద్దకు తీసుకెళ్లడంలో సక్సెస్ అవుతున్నారు.
తాజాగా సోము వీర్రాజు ఏపీ సీఎం జగన్ కు బహిరంగ లేఖ రాశారు. తాజాగా నరసింహ స్వామి ఆలయంలో జరిగిన అగ్ని ప్రమాదం ఘటన గురించి సోము లేఖలో ప్రస్తావించారు.
అంతర్వేది శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయం అంటేనే ఎంతో పేరుగాంచింది. ఆ ఆలయ ప్రాంగణంలో ఉన్న రథం అగ్నికి ఆహుతి కావడంపై సోము వీర్రాజు.. జగన్ కు లేఖ రాశారు.
రథం అగ్నికి ఆహుతి కావడం ఆందోళన కలిగిస్తోంది. ప్రతి ఏటా అంగరంగ వైభంగా అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి కళ్యాణోత్సవాలు జరుగుతాయి. కళ్యాణోత్సవాల సమయంలో స్వామి వారి రథోత్సవాలు కూడా జరుగుతాయి. ఈ ఉత్సవాలకు చాలా రాష్ట్రాల నుంచి భక్తులు తరలివస్తారు. 1958లో ఈ రథాన్ని తయారు చేశారు. అప్పటి నుంచి ఈ రథాన్నే రథోత్సవాలకు ఉపయోగిస్తున్నారు.
కానీ.. హిందువుల మనోభావాలు దెబ్బతినేలా జరిగిన ఈ అగ్ని ప్రమాదంపై విచారణ చేపట్టండి. అయితే.. ఈ అగ్ని ప్రమాద ఘటనపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇది అగ్ని ప్రమాదం వల్ల దగ్ధం అయిందా? లేక ఎవరైనా కావాలని చేశారా? అనేది తెలియాలి. నిందితులు ఎవరైనా వాళ్లను కఠినంగా శిక్షించాలి.. అంటూ సోము.. లేఖలో పేర్కొన్నారు.
అయితే.. సోము వీర్రాజు.. ఏకంగా సీఎం జగన్ కు బహిరంగ లేఖ రాయడం ప్రస్తుతం ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. మరి.. సీఎం జగన్ దీనిపై ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.