Sonia Gandhi: గత కొద్ది రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ డిశ్చార్జ్ అయ్యారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ మీడియా వ్యవహారాల ఇన్ చార్జి జై రామ్ రమేష్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. సోనియాను కొద్ది రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారని చెప్పారు. ఈ నెల 2వ తేదీన సోనియా గాంధీ కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. కోవిడ్ అనంతరం వచ్చిన ఆరోగ్య సమస్యల నేపథ్యంలో ఈ నెల 12వ తేదీ నుండి తొమ్మిది రోజులుగా సర్ గంగారమ్ ఆసుపత్రిలో సోనియా చికిత్స పొందుతున్నారు.
- Read the latest news in Telugu from AP and Telangana’s most trusted news website.
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
మరో పక్క నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో సోనియా, రాహుల్ గాంధీలకు ఈడీ సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. కరోనాతో బాధపడుతున్నందున విచారణకు హజరుకాలేనని సోనియా గాంధీ ఈడీకి లేఖ రాసిన నేపథ్యంలో ఈ నెల 23వ తేదీన విచారణకు హజరయ్యేందుకు అవకాశం ఇచ్చారు ఇడీ అధికారులు. రాహుల్ గాంధీ మాత్రం సోమవారంతో కలిపి నాలుగు రోజుల పాటు ఈడీ కార్యాలయంలో విచారణకు హజరైయ్యారు. కేంద్ర ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఈడీ విచారణ చేయిస్తుందంటూ కాంగ్రెస్ శ్రేణులు మండిపడుతున్నారు. ఈడీ విచారణను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టాయి.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?