Sonia Gandhi: ఇటీవల వెలువడిన అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే. ఆయా రాష్ట్రాల్లో ఓటమిపై ఇప్పటికే కాంగ్రెస్ పోస్టుమార్టం ప్రారంభించింది. పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యుసీ) సమావేశాన్ని నిర్వహించారు. అయిదు రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాలపై చర్చించారు. ఈ సందర్భంలో పంజాబ్ లో మాజీ సీఎం అమరీందర్ సింగ్ విషయంలో తొలుత ఫిర్యాదులు వచ్చినా అతనిపై చర్యలు తీసుకోకపోవడం తన తప్పిదమేనని సోనియా గాంధీ అంగీకరించారు. తాజాగా మంగళవారం సోనియా గాంధీ సంచలన ఆదేశాలు జారీ చేశారు.
ఉత్తరప్రదేశ్, పంజాబ్, గోవా, మణిపూర్, ఉత్తరాఖండ్ ల పీసీసీ అధ్యక్షులు తక్షణం తమ పదవులకు రాజీనామా చేయాలని సోనియా గాంధీ ఆదేశాలు జారీ చేశారు. ఆయా రాష్ట్ర శాఖలను పునర్వ్యవస్థీకరించాల్సి ఉన్నందున పీసీసీ పదవులకు రాజీనామా చేయాలని ఆమె ఆదేశించారు. ఈ మేరకు నేటి సాయంత్రం పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా ఓ ప్రకటన విడుదల చేశారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?