Sonia Gandhi: కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఈ రోజు ఎన్ఫోర్స్మెంట్ (ఈడీ) ఎదుట హజరు కావడం లేదు. ఈ మేరకు ఏఐసీసీ ఓ ప్రకటన విడుదల చేసింది. సోనియా గాంధీ వారం రోజుల క్రితం కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె హోం ఐసోలేషన్ లో ఉండి చికిత్స పొందుతున్నారు. కరోనా కారణంగా ఈడీ విచారణకు హజరు కావడం కష్టమని, విచారణకు హజరయ్యేందుకు మరి కొంత సమయం కావాలని ఈడీని ఏఐసీసీ కోరింది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
నేషనల్ హెరాల్డ్ కు సంబంధించి మనీలాండరింగ్ కేసులో విచారణకు హజరు కావాలని సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు వారం రోజుల క్రితం ఈడీ సమన్లు జారీ చేసింది. మూడు రోజుల క్రితం రాహుల్ గాంధీ విచారణకు హజరుకావాల్సి ఉండగా అంతకు ముందే ఆయన ఈడీకి లేఖ రాశారు. ముందుగా నిర్ణయించుకున్న కార్యక్రమాలలో ఉన్నందున విచారణకు హజరుకాలేకపోతున్నాననీ, సమయం కావాలని ఈడీని కోరారు. అయితే సోనియా గాంధీ మాత్రం విచారణకు హజరవుతారని కాంగ్రెస్ పార్టీ ఇంతకు ముందు వెల్లడించింది. అయితే కరోనా నుండి ఇంకా కోలుకోనందున తాను విచారణకు హజరుకాలేనని సోనియా గాంధీ ఈడీని అభ్యర్ధించినట్లు తెలుస్తొంది. కరోనా నుండి కోలుకున్నట్లుగా ఇంకా వైద్యులు నిర్ధారించకపోవడంతో సోనియా గాంధీ ఈ అభ్యర్ధనను చేశారు. ఈ నెల 2వ తేదీన సోనియా గాంధీకి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది.