Sonu Sood : దేశవ్యాప్తంగా సోనూసూద్ పేరు మారు మ్రోగుతున్న సంగతి తెలిసిందే. మహమ్మారి కరోనా వైరస్ వచ్చిన సమయములో లాక్ డౌన్ లో అనేక మంది వలస కూలీలను ఆదుకున్న సోనుసూద్.. తరవాత కూడా తన సేవా కార్యక్రమాలు కొనసాగిస్తూనే ఉన్నారు.
దేశవ్యాప్తంగా పేద పిల్లలను చదివిస్తూ మరికొంత మందికి ఉపాధి ఇచ్చే రీతిలో సోనుసూద్ ప్రత్యేకమైన టీం క్రియేట్ చేసుకుని భారీ స్థాయిలో సహాయ సహకార కార్యక్రమాలు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కూడా సోనూసూద్ అనేకమందిని ఆదుకోవడంతో ఆయన విగ్రహం పెట్టి, చాలా మంది ఆయనపై అభిమానాన్ని చాటు కోవడం జరిగింది. ఇదే క్రమంలో ఇటీవల సొంత రాష్ట్రం పంజాబులో కూడా ఈ ఆటోరిక్షాలు పంపిణీ చేయడం జరిగింది. హైదరాబాద్ నగరంలో అంబులెన్స్ ఫ్రీ సర్వీసులు కూడా అందుబాటులోకి తేవటం జరిగింది. ఈ రీతిగా అనేకమంది ఉపయోగపడుతున్న సోనుసూద్ ని అంకురా హాస్పిటల్స్ యాజమాన్యం తాజాగా సోనూసూద్ ని తమ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా సెలెక్ట్ చేసుకున్నారు. తల్లి పిల్లల అంకురా హాస్పిటల్స్ రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల నెలకొని ఉన్నాయి. అంతే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా అంకురా హాస్పిటల్స్ వారు సేవలందిస్తున్నారు. ఇలాంటి తరుణంలో సోనూసూద్ ని తమ బ్రాండ్ అంబాసిడర్ గా ఈ సంస్థ వాళ్లు తీసుకోవటంతో.. దేశవ్యాప్తంగా అంకురా హాస్పిటల్స్ పేర్లు ఇప్పుడు మారుమ్రోగుతోంది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?