సోను సూద్.. ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా తర్వాత ఎక్కువగా వినిపిస్తోన్న పేరు ఇదే. కష్టం అని తెలిస్తే చాలు వెనుకాముందు కూడా చూడకుండా సహాయం చేసేస్తున్నాడు. ఇప్పటికే కరోనా సమయంలో ఎన్నో సహాయ కార్యక్రమాలు చేసిన సోను సూద్ ఇటీవలే వ్యవసాయం కోసం శ్రమిస్తోన్న కుటుంబానికి ట్రాక్టర్ బహుమతిగా ఇచ్చి సహాయపడిన విషయం తెల్సిందే.
ఇక ఇప్పుడు మరో వార్తకు స్పందించి సోను సూద్ సహాయానికి ముందుకు రావడం విశేషం. యాదాద్రి భువనగిరి జిల్లాలో ముగ్గురు చిన్నారులు అనాథలుగా మారారని వారికి పెద్ద దిక్కు లేకుండా పోయిందని వార్త రాగా దానికి సోను సూద్ స్పందిస్తూ వారు ఇక ఎంత మాత్రం అనాథలు కారని వారి బాగోగులు ఇకపై నా బాధ్యత అని ట్వీట్ చేసాడు.