ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలామంది స్టార్ హీరోలు ఉన్నా అసలు సిసలైన రియల్ హీరో అనిపించుకున్న నటుడు సోనూసూద్. కరోనా లాక్ డౌన్ సమయములో వలస కూలీల ను ఆదుకున్న సోనుసూద్.. తర్వాత అనేక మంది పేదలను ఆదుకోవడం జరిగింది. అంతేకాకుండా కొంతమందికి ఉపాధి కూడా కల్పించడం జరిగింది.
సపరేట్ గా టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసి తమ సేవలు విస్తరించే రీతిలో సోను సూద్ వ్యవహరిస్తున్న తీరు దేశంలో చాలా మందిని ప్రభావితం చేస్తూ ఉంది. ప్రభుత్వాలు చేసే పనులు వ్యక్తిగా సోను చేయటం పట్ల చాలామంది ప్రశంసలు కురిపిస్తూ ఆదర్శంగా కూడా తీసుకుంటున్నారు. ఇటువంటి నేపథ్యంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో తాజాగా 100 మంది సినిమా కార్మికుల పిల్లలకు తన వంతు సాయాన్ని అందజేశారు.
మేటర్ లోకి వెళితే ప్రస్తుతం కరోనా నేపథ్యంలో చాలా పాఠశాలలు ఆన్ లైన్ తరగతులు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో చాలామంది సినీ కార్మికుల పిల్లలు స్మార్ట్ ఫోన్ లు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. అయితే సోనుసూద్ హైదరాబాదులో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఆచార్య సినిమా షూటింగ్ లో ఉండటంతో ఈ విషయం తన దాక రావడంతో.. వందమంది సినీ కార్మికుల పిల్లలకు స్మార్ట్ ఫోన్ లు బహుమతిగా అందజేశారు. అయితే ఇది కార్మికులకు తెలియకుండా సర్ ప్రైజ్ తరహాలో అందించడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయింది. అంతేకాకుండా సోనూసూద్ చేసిన సాయాన్ని జీవితంలో మర్చిపోలేమని ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.